Supreme Court: చెట్టు నరికితే లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

యూపీలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే 454 చెట్లను నరికి వేయగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నరికిన ఒక్కో చెట్టుకు రూ.లక్ష ఫైన్‌తో పాటు మళ్లీ 454 మొక్కలు నాటాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని తెలిపింది.

New Update
supreme court of india

supreme court of india Photograph: (supreme court of india)

పర్యావరణాన్ని కాపాడాల్సిన సమాజం చెట్లను నరుకుతున్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మనిషి చెట్లు నరకడాన్ని దారుణంగా భావించి సంచలన తీర్పునిచ్చింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే.. ఒక్కో దానికి రూ.లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఎవరైనా చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విక్టరీ..

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

రాత్రికి రాత్రే 454 చెట్లు నరికివేయడంతో..

ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్‌లో శివ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి  రాత్రికి రాత్రే ఏకంగా 454 చెట్లను నరికేసాడు. దీంతో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.  చెట్లను తేలికగా తీసుకోవద్దని, చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్థులకు తప్పకుండా కఠిన శిక్ష విధిస్తామని తెలిపింది. శివ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి అనుమతి లేకుండా 454 చెట్లను నరికి వేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇతనికి కోర్టు శిక్ష విధించింది. ఎన్ని చెట్లు అయితే నాటారో అన్ని మొక్కలు నాటాలని తీర్పునిచ్చింది. అలాగే ఒక్కో చెట్టుకు రూ.1 లక్ష జరిమానా కూడా విధించింది. 

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

యూపీ వృక్ష సంరక్షణ చట్టం 1976 ప్రకారం తప్పకుండా జరిమానా వసూలు చేయాలని కోర్టు అటవీ శాఖను ఆదేశించింది. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1972 ప్రకారం ప్రభుత్వ భూమిలో 32 చెట్లను నరికినందుకు భూ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది. పర్యావరణ విషయంలో అసలు దయ చూపకూడదు. చెట్లను నరికివేయడం అనేది మనిషిని చంపడం కంటే దారుణమని స్పష్టం చేసింది. 454 చెట్లు మళ్లీ పెరగాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుందని, కనీసం కోర్టు అనుమతి లేకుండా వాటిని నరికేశారు అని ధర్మాసనం తెలిపింది. 

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

 

supreme-court | agra | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏపీకి గుడ్‌న్యూస్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది.

New Update
Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. మొత్తం 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌ డబ్లింగ్‌కు కేంద్రం ఆమెదం తెలిపిందని చెప్పారు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

'' ఈ ప్రాజెక్టు వల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 35 లక్షల పనిదినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని'' అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 

Also read: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

మరోవైపు PMKSYలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్‌ మేనేజ్‌మెంట్ స్కీమ్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి కూడా కమాండ్ ఏరియా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. 

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

bjp | telugu-news | ashwini-vaishnaw | andhra-pradesh

Advertisment
Advertisment
Advertisment