Breaking: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
Sonia Gandhi

Sonia Gandhi


కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఒకవేళ ఆమె ఆరోగ్యం కుదుటపడకపోతే ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశాలకు వెళ్లకపోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశంలో పాల్గొననున్నారని పేర్కొన్నాయి.   

Also Read: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!

ఇదిలాఉండగా.. కర్ణాటకలో బెలగానిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమవేశాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్‌కు నవ సత్యాగ్రహ భైఠక్‌ అని పేరు కూడా పెట్టారు. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలతో పాటు ప్రత్యేక ఆహ్వనితులు హాజరుకానున్నారు. అయితే మొత్తంగా ఈ మీటింగ్‌లో 200 మంది నేతలు పాల్గొమటారని AICC తెలిపింది.  

Also Read: కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి.. ఆప్‌ షాకింగ్ కామెంట్స్

అయితే గురువారం మధ్నాహ్యం  సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఇక శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. అలాగే వచ్చే ఏడాదిలో పార్టీ తీసుకోవాల్సిన కార్యచరణపై కూడా కీలక చర్చలు జరపనున్నారు. 

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment