viral News: పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకుంటున్నారు..!

పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది.

New Update
lawyer

lawyer

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌ లో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఇరుకుటుంబాల ఆరోగ్య,ఆర్థిక, ఆస్తి, స్థితిగతులను తెలుసుకుని వివాహలు చేస్తుంటారు. అయితే ఇటీవలే కోర్టులో  ఓ న్యాయవాదికి, న్యాయమూర్తికి మధ్యన జరిగిన వాదన ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

ఆ  వీడియోలో.... వారిద్దరి సంభాషణ ఇలా సాగింది...
న్యాయమూర్తి: “మీకు ఉద్యోగం లేదా?”
వ్యక్తి: “లేదు సార్. నన్ను పిలిచినప్పుడల్లా నేను వెళ్లి డాక్టర్ సర్వీస్ ఇస్తానని చెప్పాను. 
న్యాయమూర్తి: “వారు ముందస్తు అనుమతి తీసుకున్నప్పుడు, అది పూర్తిగా తప్పు. మీ ఆదాయం గురించి మీరు ఏం తెలియజేశారు.


వ్యక్తి: “సార్, నాకు ఇప్పుడు ఉద్యోగం లేదని నేను చెప్పాను. నన్ను పిలిచినప్పుడు, నాకు ఉద్యోగం ఉందని రాశాను.”
న్యాయమూర్తి: “మీరు డాక్టర్. ఆదాయం లేకుండా వివాహం చేసుకునే హక్కు న్యాయవాదికి మాత్రమే ఉంది. వైద్యుడికి ఎటువంటి హక్కు లేదు. మీకు ఆదాయం లేకపోతే, మీరు ఎందుకు వివాహం చేసుకున్నారు?”

Also Read: హెల్త్‌ సూపర్‌వైజర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!

ఈ వాదన మధ్యప్రదేశ్ కి చెందిన ప్రముఖ న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ కి ఓ డాక్టర్ కి మధ్యన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సంపాదన లేనప్పుడు వెళ్లేందుకు చేసుకున్నారని వివేక్ అగర్వాల్ అడిగిన ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా సంపాదన ఉండాలని రాజ్యంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తులు, అంతస్తులు, సంపాదన వంటివి చూసి పెళ్లి చేసుకుంటే అందులో వ్యాపారం తప్ప.. ప్రేమ ఎక్కడుంటుందని అంటున్నారు మరికొందరు.

ఇంకొందరు మాత్రం మగాడు సంపాదిస్తినే పెళ్ళికి అర్హుడా..? ఒకవేళ పెళ్ళికి ముందు మంచి ఉద్యోగం లక్షల్లో జీతం ఉండి.. పెళ్లి తర్వాత ఏదైనా కారణాలవల్ల ఉద్యోగం కోల్పోతే విడాకులు ఇచ్చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఈ వాదనలో న్యాయమూర్తి ఎందుకు అలాంటి ప్రశ్నలు అడగాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

Also Read: BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

Also Read: Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

madhyapradesh | video | audio record | viral | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment