UNION BUDGET 2025: బీహార్ కు బోనాంజా.. ఎన్నికల వేళ నిర్మలమ్మ భారీగా కేటాయింపులు.. లిస్ట్ ఇదే!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు.బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

New Update
Nirmala seetharaman saree

Nirmala seetharaman saree Photograph: (Nirmala seetharaman saree)

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు. భారీ అంచనాల వేళ నిర్మల తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను సభ ముందు ఉంచారు. రైతులు.. మహిళలకు..ఎంఎస్ఎంఈ లకు కీలక కేటాయింపులు చేసారు. అదే విధంగా బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. పలు రంగాలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

Also Read:  Summer in Winter: అప్పుడే వేసవి మొదలై పోయిందా..నిన్ననే 35 డిగ్రీలు నమోదు

ఈ బడ్జెట్ లో కేంద్రం త్వరలో ఎన్నికలు జరగునున్న బీహార్ కు మూడు కీలక ప్రాజెక్టులు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. ఇక సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు. రూ.10లక్షల విలువైన క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం 10 లక్షల కార్డులు జారీ చేయనున్నారు. 

Also Read: New Rules :ఫిబ్రవరిలో నయా రూల్స్.. ఆ యూపీఐ పేమెంట్లు బంద్, వడ్డీ రేట్లు సహా మారుతున్నవి ఇవే!

స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని నిర్మలా సీతారామన్ ముందుగానే వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తామని వివరించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్య సేకరణ చేస్తామని ప్రకటించారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుందని చెప్పిన నిర్మలా.. సున్నా శాతం పేదరికమే మా లక్ష్యంగా వెల్లడించారు. వికాస్‌ భారత్‌లో వంద శాతం క్వాలిటీ విద్య లక్ష్యమని తెలిపారు. 2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతంగా పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లు సబ్ కా వికాస్ కు సువర్ణావకాశంగా వెల్లడించారు. కిసాన్‌ క్రెడిట్‌ రుణాలు పెంపు పోస్టల్‌ రంగానికి కొత్త జవసత్వాలు వస్తాయని పేర్కొన్నారు. 

ధన్ ధాన్య యోజన కార్యక్రమం ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక ప్రకటించారు.

Also Read: Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment