Delhi: అధికారుల ముందు కోరికల చిట్టా ఉంచిన రాణా!

ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్‌ కు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఖురాన్, పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు.

New Update
Tahawwur Rana With NIA Officials

Tahawwur Rana With NIA Officials

ముంబయి ఉగ్రదాడుల కుట్రదారుడైన తహవూర్ హుస్సేన్ రాణా..  జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ముఖ్యంగా ఖురాన్ , పెన్ను, పేపర్ వంటి ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు. అతడికి అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ.., ఖురాన్ ని నమాజ్ కోసం ఉపయోగించాడని అధికారులు తెలిపారు.

Also Read:Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

అవరసమైన వస్తువులను అతడికి అందించనప్పటికీ రాణా ప్రతీ చర్యను సునిశితంగా గమనిస్తున్నారు. అతడు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.కాగా, ముంబయి దాడుల ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పెద్ద సంఖ్యలో జరిగిన ఫోన్ కాల్స్‌ డేటా సహా దర్యాప్తు సంస్థ సేకరించిన వివిధ సాక్ష్యాల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. తహవూర్ రాణాకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో అనుమానాస్పద సంబంధాలు, దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో  అతడి అనుబంధంపై ప్రశ్నిస్తున్నారు.

Also Read: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

ముంబయిలో పనిచేయని ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని నిర్వహించడానికి నిధులను ఎలా సమకూర్చాడనే దానిపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతుంది. 2006,-2009 మధ్య డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ నిఘా కార్యకలాపాలకు ఇది ఓ కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో అతడి సమావేశాలు, మెయిల్ సంభాషణల గురించి కూడా NIA అతడ్ని విచారిస్తోంది.

2005లో డేవిడ్ హెడ్లీని భారత్‌లో గూఢచర్యం నిర్వహించమని లష్కరే తొయిబా ఆదేశించినప్పటి నుంచి జరిగిన కుట్రను ఈ విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు. ముంబయి ఉగ్రదాడులు ప్రణాళికల గురించి తెలిసిన దుబాయ్‌లోని రహస్య సాక్షి సహా అతడు కలిసిన ఇతర వ్యక్తుల గురించి కూడా రాణాను ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి.

దేశ ఆర్థిక రాజధానిలో దాడులకు కొన్ని రోజుల ముందు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రాణా ప్రయాణాలు కీలక ఆధారాలు అందజేస్తాయని NIA అధికారులు ఆశిస్తున్నారు.‘ తహవూర్ రాణా 18 రోజుల పాటు NIA కస్టడీలో ఉంటాడు. ఆ దాడుల్లో మొత్తం 166 మంది మరణించారు.. 238 మందికి పైగా గాయపడ్డారు’ అని శుక్రవారం తెల్లవారుజామున కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

rana | delhi | mumbai | attacks | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | Tahawwur Rana

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ టెర్రర్ అటాక్.. లైవ్ అప్‌డేట్స్

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

author-image
By Krishna
New Update
terror-attack

terror-attack

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

  • Apr 27, 2025 14:02 IST

    రంగంలోకి ఇండియన్ నేవీ



  • Apr 27, 2025 10:26 IST

    మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

    ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. 



  • Apr 27, 2025 10:08 IST

     పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం

    భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
    ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
    భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
    టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
    ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
    ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్‌ టీం?



  • Apr 27, 2025 08:49 IST

    కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

    రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
    కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు  మనవాళ్లే - విజయ్ దేవరకొండ
    ప్రాపర్‌ ఎడ్యుకేషన్‌ లేక ఇలా బిహేవ్‌ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
    ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి  - విజయ్ దేవరకొండ
    వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ 
    వాళ్లకే  విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్‌ దేవరకొండ

     ఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్



  • Apr 27, 2025 08:48 IST

    భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు

    LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
    అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
    సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
    సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
    పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
    2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం?



  • Apr 27, 2025 08:20 IST

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ

    తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ

    కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద

    48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం.. 



  • Apr 27, 2025 08:18 IST

    పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

    ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. 



  • Apr 27, 2025 08:15 IST

    జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

    పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Advertisment
Advertisment
Advertisment