/rtv/media/media_files/2025/04/13/nodNhkZLzIlrozAs6DRz.jpg)
temple
ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి వేళ వచ్చిన కొందరు వ్యక్తులు.. తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడికి దిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్లో చోటుచేసుకుంది. సుమారు 30 మంది వ్యక్తుల గుంపు తమను లోపలికి అనుమతించనందుకు పూజారి మీద దాడిచేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
Also Read: NewYork: న్యూయార్క్ లో విమాన ప్రమాదం...!
ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాతా టెక్రి ఆలయంలో జరిగిందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నేర చరిత్ర ఉన్న జీతూ రఘువంశీ అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి సుమారు 30 మందితో కలిసి ఎనిమిది నుంచి పది కార్లలో ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొండపై ఉన్న ఆలయం వద్దకు చేరుకున్న కాన్వాయ్లోని కొన్ని కార్లకు ఎర్రటి లైట్లు కూడా ఉన్నాయి. వారు తరువాత ఆలయం లోపల ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించారు.
Mata Tekri Temple Priest Incident
‘మేము అర్ధరాత్రికి ఆలయ తలుపులు మూసివేస్తాం... జీతూ రఘువంశీ నేతృత్వంలోని గుంపు రాత్రి 12:40 గంటలకు మా వద్దకు వచ్చింది. అప్పటికే నేను గుడి తలుపులు మూసివేశాను. ఆలయం మూసివేసినట్టు నేను వారికి చెప్పడంతో ద్వారాలు తెరవమని నన్ను బలవంతం చేశారు.. నన్ను చంపుతామని బెదిరించారు.. వారు నన్ను కొట్టారు’’ అని పూజారి తెలిపారు.
దేవాస్ సిటీ ఎస్పీ దినేష్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ..పూజారి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలోని సుమారు 50 కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే, బీజేపీ నేత కుమారుడు ఈ గుంపునకు నాయకత్వం వహించి, వారిని తీసుకుని వచ్చాడా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేసు దర్యాప్తులో ఉందని అగర్వాల్ సమాధానం తెలిపారు.
Also Read:Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
latest telugu news updates | latest-telugu-news | telugu-news | again temple attack | madhya pradesh news | today-news-in-telugu | national news in Telugu
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు