BIG BREAKING: హిడ్మా హతం.. గొంతుకోసి చంపిన మావోయిస్టులు.. సంచలన లేఖ విడుదల!

మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీష్‌గడ్​ సుక్మా జిల్లా పెంటపాడుకు చెందిన పటేల్​ కల్ము హిడ్మా(65)ను గొంతు కోసి చంపేశారు. భూ దందాలకు పాల్పడుతున్నాడనే కారణంగా శిక్షించినట్లు మృతదేహం వద్ద లేఖ వదిలి వెళ్లడం సంచలనం రేపుతోంది. 

New Update
Maoist: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి..

Maoists killed Hidma

BIG BREAKING: ఛత్తీష్‌గడ్​ సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. పెంటపాడుకు చెందిన పటేల్​ కల్ము హిడ్మా(65)ను గొంతు కోసి చంపేశారు. భూ దందాలకు పాల్పడుతున్నాడనే కారణంగా శిక్షించినట్లు మృతదేహం వద్ద లేఖ వదిలి వెళ్లడం సంచలనం రేపుతోంది. 

ఇంటి నుంచి ఎత్తుకెళ్లి..

ఈ మేరకు సోమవారం రాత్రి చింతగుఫా పోలీస్టేషన్ పరిధిలోని పెంటపాడు గ్రామ పటేల్​ కల్ము హిడ్మా(65) ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే అదే రాత్రి కుంట ఏరియా కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు అతన్ని బలవంతంగా అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఊరి చివర హిడ్మాను కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. అయితే డెడ్ బాడీని గ్రామశివారులో వదిలేసిన మావోయిస్టులు.. మృతదేహం వద్ద లేఖ వదలివెళ్లారు.  

గ్రామంలో భూ దందాలు.. 

హిడ్మా కొంతకాలంగా గ్రామంలో భూ దందాలకు పాల్పడుతున్నాడు. బలవంతంగా తన పేరిట పట్టాలు చేయించుకుంటున్నాడు. పద్దతి మార్చుకోవాలని చెప్పినా వినలేదు. అందుకే ఈ శిక్ష వేయాల్సి వచ్చింది. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇక సీపీఐ మాజీ ఎమ్మెల్యే మనీశ్​​కుంజాం మృతుడు హిడ్మాకు మామ అవుతాడని బంధువులు, సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ తెలిపారు. అయితే మావోయిస్టుల ఆరోపలు, చర్యలను మనీశ్​​కుంజాం తీవ్రంగా ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment