Fire Accident: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు

తమిళనాడులోని తిరుముల్లెవాయల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.ఆ తర్వాత ఫ్యాక్టరీ పక్కనున్న కాలేజీకి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు పరుగులు తీశారు.

New Update
Fire Accident

Fire Accident

Fire Accident: తమిళనాడు(Tamil Nadu)లోని తిరువల్లూరు జిల్లా(Tiruvallur District) తిరుముల్లెవాయల్‌(Thirumullevayal)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ(Chemical Factory)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కార్మికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా చల్లారలేదు. చివరికీ ఫ్యాక్టరీ పక్కనున్న కాలేజీకి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు పరుగులు తీశారు.  

Also Read: భారత్‌లో తగ్గిన ఆత్మహత్యల మరణాల రేటు..

Also Read: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

ఫ్యాక్టరీకి భారీగా ఆస్తినష్టం..

సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీకి భారీగా ఆస్తినష్టం జరిగిట్లు తెలుస్తోంది. అక్కడ పనిచేసే సిబ్బంది ఈ ప్రమాదం నుంచి బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో చాలాచోట్ల ఇలా అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది. 

Also Read: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ ఎలా క్రియేట్ చేశాడంటే..?

మంగళవారం హైదరాబాద్ కుషాయిగూడ (Kushaiguda) లో కూడా భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కుషాయిగూడ బస్ డిపోలో మంటలు చెలరేగడంతో రెండు ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కాలి బూడిదయ్యాయి.  రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 

Also Read: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేప‌ట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు.

New Update
Jammu and kashmeer MLAs

Jammu and kashmeer MLAs

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎమ్మెల్యేలు శాసన సభ ఆవరణలో ఘర్షణకు దిగారు. జమ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో తన అసంతృప్తిని వినిపించాలని కొందరు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. అయితే మూడు రోజుల‌గా అసెంబ్లీ వాయిదాల ప‌ర్వం న‌డుస్తోంది. అయితే ఈరోజు( బుధవారం) కొంద‌రు ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో గొడవ పడ్డారు. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు వాయిదా వేశారు. అసెంబ్లీ లోప‌ల ఆప్ ఎమ్మెల్యే మెహ‌రాజ్ మాలిక్‌, పీడీపీ ఎమ్మెల్యే వ‌హీద్ పారా మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. రెండు వ‌ర్గాలుగా మారిన ఎమ్మెల్యేలు.. ఒక‌రిపై ఒక‌రు దూషించుకున్నారు. 

గ‌త రెండు రోజుల నుంచి కూడా అసెంబ్లీని స్పీక‌ర్ అబ్దుల్ ర‌హీమ్ వాయిదా వేశారు. ఇవాళ కూడా అధికార నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేప‌ట్టారు. ఇటీవ‌ల కేంద్రం ఆమోదించిన వ‌క్ఫ్ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ప్రతిప‌క్ష నేత సునిల్ శ‌ర్మ కూడా వెల్‌లోకి దూసుకెళ్లిన ఎన్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంద‌రు ఎమ్మెల్యేలు స‌భ‌లో ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో ప్రతిష్టంభ‌న ఏర్పడింది. ఆ స‌మ‌యంలో హౌజ్‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు.

Advertisment
Advertisment
Advertisment