Bike Taxi Ban: ఊబర్, ఓలా, ర్యాపిడో బైక్‌లు బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు!

బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 

New Update
karnata rapido

Karnataka High Court sensational verdict on bike taxi controversy

Bike Taxi Ban: బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని, ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని స్పష్టం చేసింది. సరైన చట్టం అవసరమని జస్టిస్ బీఎం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వానికి బైక్ టాక్సీ సేవలను మోటార్ వాహనాల చట్టం  1988 కింద చేర్చటానికి మూడు వారాల గడువును అందిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

సరైన చట్టబద్ధత అవసరం..

ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో, బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న వ్యక్తులపై దాడులు పెరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తెల్ల నంబర్ ప్లేట్లు కలిగిన టూవీలర్స్ వాణిజ్యపరంగా వినియోగానికి అనుమతి లేదని, బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగేటర్ల సేవలను  వ్యతిరేకించింది. దీనికి విచారించిన కోర్టు సరైన చట్టబద్ధత అవసరమని తెలిపింది. టూవీలర్లకు రవాణా వాహనాలుగా గుర్తించటం లేదా వాటికి కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిషన్లు ఇచ్చేలా తాము రవాణా శాఖను ఆదేశించలేమని తెలిపింది. తమ ఆదేశాలను పాటించి, కార్యకలాపాలను నిలిపివేయాలని పిటిషనర్లను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

అలాగే ట్రాఫిక్, భద్రతపై బైక్ టాక్సీల ప్రభావాన్ని అంచనా వేసిన 2019 నిపుణుల కమిటీ నివేదికను ఈ సందర్భంగా కోర్టు ఉదహరించింది. ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించే ముందు నియంత్రణ స్పష్టత అవసరమని నొక్కి చెప్పింది. 

ఇది కూడా చదవండి: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా?

high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment