పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్‌లో పేలుడు

జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్ మైన్ పేలింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న పెట్రోలింగ్ జీప్‌కు ఇది జరగింది.

New Update
jhammu kashmir

jhammu kashmir Photograph: (jhammu kashmir)

సంక్రాంతి, కుంభమేళ పర్వదినాన జమ్మూకశ్మీర్‌లో పేలుడు సంభవించింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం ల్యాండ్ మైన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. పెట్రోలింగ్ పార్టీ జీప్ ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ల్యాండ్ మైన్ పేలుడు సంభవించింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం గస్తీని నిర్వహిస్తున్న టైంలో ఒకరు ప్రమాదవశాత్తూ ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి, వారికి వెంటనే వైద్య సహాయం అందించారు.

Read also : ఒలింపిక్స్ మెడల్స్‌లో కల్తీ.. పతకాలు తిరిగి ఇచ్చేస్తున్న విజేతలు

అదృష్టవశాత్తూ, సైనికులకు తగిలిన గాయాలు ప్రాణాపాయం కాదని, వారందరూ నిలకడగా ఉన్నట్లు సమాచారం. తదుపరి చికిత్స కోసం సైనికులను వెంటనే సమీపంలోని వైద్య సదుపాయానికి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతం నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నందున హైసెక్యూరిటీ జోన్‌గా గుర్తించబడింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment