Google Maps: గూగుల్ మ్యాప్స్‌ తప్పిదం.. పోలీసులను చితకబాదిన స్థానికులు

అసోంలో ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. కానీ పోలీసులను దొంగలుగా భావించిన స్థానికులు వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు.

New Update
Police jeep and Google maps

Police jeep and Google maps

కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చాలామంది గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్తారు. అయితే కొన్నిసార్లు ఈ మ్యాప్స్‌ తప్పుదారిని కూడా చూపిస్తుంటాయి. వాహనాలు నదులు, చెరువుల్లోకి దూసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అసోంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు. అది చివరికి పరాభవానికి దారి తీసింది. పోలీసులను స్థానికులు దొంగలుగా భావించారు. వాళ్లని చితకబాదారు. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులకు సారీ చెప్పి వదిలేశారు.   

Also Read: మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?

'' ఇక వివరాల్లోకి వెళ్తే అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన ఓ పోలీస్ టీమ్ నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఇందుకోసం ఆ పోలీస్ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని వెళ్లారు.అయితే ఆ మ్యాప్స్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపెట్టాయి. అది నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాలోని ఓ ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు.  

Also Read: తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

అయితే పోలీసు వద్ద ఆయుధాలను చూసి అక్కడున్న స్థానికులు వాళ్లని దుండగులుగా భావించారు. దీంతో వాళ్లను దాడులు చేశారు. ఆ తర్వాత వాళ్లని బంధించారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. చివరికి ఈ విషయం తెలుసుకన్న జోరాత్ పోలీసులు మోకోక్‌చంగ్ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. స్థానికుల చేతిల్లో బంధీలైన పోలీసులను విడిపించేందుకు మరో పోలీస్ బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో ఆ పోలీస్‌ టీంకు క్షమాపణలు చెప్పి వదిలేశారు. 

Also Read: ఆ విషయం KCRకు తెలుసా?: KTRను అడుగుతున్న 24 ప్రశ్నల లిస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment