Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా..

భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

New Update
x

Social Media X

భారత కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ ఫామ్ లు కొట్టుకుంటున్నాయి. ఎక్స్ లో కంటెంట్ ను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంటే...దానిని వ్యతిరేకిస్తోంది ఎక్స్ యాజమాన్యం. దీనికి సంబంధించి తాజాగా కర్ణాటక హైకోర్ట్ లో పిటిషన్ కూడా దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కంటెంట్‌ను నియంత్రిస్తోందని.. ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతుందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా వేసింది. ఐటీ చట్ట ప్రకారం భారత ప్రభుత్వం బ్లాక్ చేసిన కంటెంట్ తొలగించకపోతే ఎక్స్ తన చట్ట బద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉందని చెప్పింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమ ఐటీ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎక్స్ యాజమాన్యం చెబుతోంది. ఇది అనధికారంగా తమపై సెన్సార్ చేయడమేనని తన పిటిషన్ లో పేర్కొంది. 

గ్రోక్ పై దృష్టి పెట్టిన కేంద్రం 

మరోవైపు ఎక్స్ ఏఐ అయిన గ్రోక్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.  ఇటీవల కొంతమంది వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌ చాట్‌బాట్‌ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఇది సోషల్‌ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ.. ఈ గ్రోక్‌ వివాదంపై ఎక్స్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు యత్నిస్తు్న్నామని అధికారులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ ఈ గ్రోక్‌ చాట్‌బాట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ భూమిపై అత్యంత తెలివైన ఏఐ టూల్‌ అని ఎలాన్ మస్క్‌ అన్నారు. అయితే ఇటీవల యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్‌ ఇచ్చిన సమాధానాలు అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి.

 

Also Read:  KS: కర్ణాటకలో హనీ ట్రాప్..మంత్రులతో సహా.. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment