CBI: మీరెవర్రా బాబు.. ఏకంగా సీబీఐ ఆఫీసులోనే చోరీ చేశారు..

త్రిపురలోని సీబీఐ ఆఫీసులో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్‌ సామగ్రీ ఇలా అన్నింటిని దోచుకెళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు.

New Update
Robbery in CBI Office, Tripura

Robbery in CBI Office, Tripura

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)..  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డేవారికి ఈ పేరు వింటేనే హడలిపోతారు. అయితే ఓచోట మాత్రం ఏకంగా సీబీఐ ఆఫీసులోనే చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆ కార్యాలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారు. కబోర్డులు, కిటికీలు, స్టీల్ వస్తువులు ఇలా ఏవి దొరికితే వాటిని అందినకాడికి దోచుకొని వెళ్లారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనేదే కదా మీ డౌట్. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.  

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

ఇక వివరాల్లోకి త్రిపుర రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ష్యామలీ బజార్‌ క్వార్టర్‌ కాంప్లెక్స్‌లో ఉన్న సీబీఐ ఆఫీసులో దొంగలు పడ్డారు. డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్‌ సామగ్రీ ఇలా అన్నింటిని దోచుకెళ్లారు. ఆ ఆఫీసులో ఒట్టి గోడలు తప్ప ఏమీ మిగలలేదు. అయితే ఆ ఆఫీసు ఐదు నెలలుగా మూసి ఉంది. ఇటీవలే సీబీఐ అధికారులు ఆ బ్రాంచ్‌కు వెళ్లారు. గదిలో వస్తువులు ఏమీ లేకపోవడం చూసి షాకైపోయారు. 

Also Read: మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. కన్వర్టెడ్ అంటూ!

ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికీ త్రిపుర రాజధాని అగర్తల దగ్గర్లో ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వాళ్ల నుంచి కొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువులను సేకరించేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ చోరీ వెనుకు ఇంకా ఏదైనా కారణం ఉందా ? అనేదానిపై ఆరా తీస్తున్నారు.  

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment