Uttar Pradesh: అతడికి నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. ఇద్దరు కలిసి జంప్‌

యూపీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఇరు కుంటుంబాలు కంగుతిన్నాయి.

New Update
Couple Elopes Leaving Spouses, Nine Children Behind In UP

Couple Elopes Leaving Spouses, Nine Children Behind In UP

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థనగర్‌ జిల్లాలోని మహరియా గ్రామానికి చెంది గీతకు ఐదుగురు సంతానం. అలాగే అదే గ్రామానికి చెందిన గోపాల్‌ నలుగురు పిల్లలకు తండ్రి. 

Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

Couple Elopes Leaving Spouses

అయితే గీత, గోపాల్‌కు ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వారం రోజుల క్రితం వీళ్లిద్దరూ తమ జీవిత భాగస్వాములు, పిల్లలను వదిలపెట్టి తమ ఇళ్లల్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5న గీతతో దిగిన ఫొటోలను గోపాల్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ సమాచారం తెలియడంతో ఇరు కుటంబాలతో పాటు గ్రామస్థులు షాక్ అయిపోయారు. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

దీంతో గీత భర్త శ్రీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కష్టపడి సంపాదించిన రూ.90 వేల నగదు, ఇంట్లో ఉన్న నగలు తీసుకుని గీత పారిపోయిందని చెప్పాడు. ఇక గోపాల్ భార్య అయితే.. తన భర్త చనిపోయిడని ప్రకటించింది. గోపాల్ ఎక్కడైనా ఉండొచ్చని.. కానీ తన పిల్లల కోసం వాళ్ల హక్కు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. వాళ్ల పోషణకు ఆర్థికంగా బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

 

Uttar Pradesh | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | couples

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment