Honey Trap: కర్ణాటకలో హనీట్రాప్‌ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో మంత్రులు సహా చాలామంది హనీట్రాప్‌లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.

New Update
CM Siddaramaiah responds on Honeytrap in Assembly

CM Siddaramaiah responds on Honeytrap in Assembly

కర్ణాటకలో ప్రస్తుతం హనీట్రాప్ అంశం దుమారం రేపుతోంది. మంత్రులు సహా అనేక మంది ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అయితే శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ డిమాంట్ చేసారు. హానీ ట్రాప్‌ విచారణను పక్కనపెట్టి స్పీకర్ ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడంతో విమర్శలు చేశారు. ఆయన చుట్టూ చేరి నిరసనలు తెలిపారు. 

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

CM Siddaramaiah Says About Honey Trap

దీంతో బీజేపీ నేతల తీరుపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. కేసు నమోదై దర్యాప్తు మొదలైతే హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. చట్టప్రకారమే దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ నేతలు సభలు అనవసరంగా గందరగోళం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.  

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

ఇదిలాఉండగా కర్ణాటకకు చెందిన చాలామంది రాజకీయ నేతలు హనీట్రాప్‌లో చిక్కుకుపోయారని సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న ఇటీవల అసెంబ్లీలో చెప్పడం సంచలనం రేపింది. దాదాపు 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని చెప్పారు. వాళ్లకి సంబంధించిన అసభ్య వీడియోలు సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్నాయన్నారు. ఇది ఒక్క పార్టీకే పరిమితమైన అంశం కాదని.. అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలకు చెందినవాళ్లు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారని తెలిపారు .  

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్

 

karnataka | rtv-news | honey trap telugu news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amarnath Yatra: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాములో జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమర్‌నాథ్ యాత్ర 2025 భద్రతతో సజావుగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని, ఉగ్రవాదం ఎదుర్కొనే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

New Update
Amarnath Yatra

Amarnath Yatra

Amarnath Yatra: కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌(Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 3న ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర 2025 నిర్వాహనపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానం ఇస్తూ.. ఈ యాత్రను దేశ ప్రభుత్వం పూర్తి భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: భర్త లేని టైం చూసి.. నలుగురు గుడిసెలో దూరి..!

జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన గోయల్‌ మాట్లాడుతూ, “భారత దేశం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని సహించదు, అలాగే పాక్‌తో సంబంధాలు కొనసాగించబోదు. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు,” అని స్పష్టం చేశారు. దేశం అన్ని విషయాల్లో దృఢంగా ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సక్రమంగా స్పందిస్తుందని అన్నారు.

Also Read: సాఫ్ట్‌వేర్ కామాంధుడు.. అడ్డంగా దొరికేసాడు..!

అమర్‌నాథ్ యాత్రను ప్రశాంతంగా సాగించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ఇప్పటికే చేపట్టినట్లు ఆయన తెలిపారు. భద్రతను పెంచేందుకు సైన్యం, కేంద్ర మంత్రివర్గ భద్రతా సంఘం (CCS) సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

టూరిజం పునఃప్రారంభం..

'కశ్మీర్‌లో టూరిజం త్వరలోనే పునఃప్రారంభమవుతుంది. అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరుగుతుంది. దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది, దాన్ని వెనక్కి లాగే శక్తి ఏదీ లేదు,” అని గోయల్ స్పష్టం చేశారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

ఈ ప్రకటనతో పహల్గాం ఘటనపై దేశ ప్రజల ఆందోళనకు కొంచెం ఊరట కలిగినట్లయింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నది గోయల్ అభిప్రాయపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment