UPI Transactions: యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం రూ.1500 బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
UPI Payment (file Photo)

UPI Payment (file Photo)

UPI Transactions: బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో(India) ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగానే బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు సంబంధించి 0.15 శాతం ప్రోత్సహకాలు అందించనుంది. ఇందులో భాగంగా ఈ లావాదేవీలను ప్రోత్సహించేందుకు  రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయించింది.

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

అయితే కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. '' యూపీఐ లావాదేవీలు రూ.210 లక్షల కోట్లకు చేరాయి. రూ.2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ప్రసుతం యూపీఐ విధానంలో చూసుకుంటే కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్‌ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్‌ సంస్థ నుంచి 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. రూ.1500 కోట్లు ఇన్సెంటివ్‌ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడం లేదని'' తెలిపారు.   

Also Read: సునీతా విలియమ్స్‌ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ?

కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్‌ ఏర్పాటు

మరోవైపు వీటితో పాటు కేంద్రం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. అసోంలో బ్రౌన్‌ఫీల్డ్‌ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్‌ ఏర్పాటు, అలాగే రూ.2790 కోట్లతో పాడిపరిశ్రమ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. అంతేకాదు గోకుల్‌ మిషన్‌కు రూ.3400 కోట్లు, రూ.4500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు పచ్చజెండా ఊపింది. 

Also Read: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్‌, జోమి తెగల మధ్య గొడవలు

Also Read: ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్‌కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

National Herald case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..  సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది.  కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్‌ తీసుకోలేమని స్పష్టం చేసింది.

New Update
ed-sonia

ed-sonia

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..  అందుకు కోర్టు నిరాకరించింది.  కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ తీసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.  నేషనల్ హెరాల్డ్ కేసులో తదుపరి విచారణను మే 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని సంబంధిత పత్రాలను తీసుకురావాలని కోర్టు ఈడీని కోరింది. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.  

సీబీఐ విచారణ మధ్యలోనే

కాగా నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో   సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ లను ఈడీ అధికారులు గతంలో చాలు సార్లు విచారణకు పిలిపించి విచారించారు.   విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారన్న ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సీబీఐ విచారణ మధ్యలోనే అగిపోయినప్పటికీ ఈడీ మాత్రం దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.

ఈ కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వారిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటుగా ఆ పార్టీకి  చెందిన నేతలు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌ దాఖలు చేశారు.  

Advertisment
Advertisment
Advertisment