Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్  చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.  మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఫోటొతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు.

New Update
Swati Maliwal

Swati Maliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Delhi Assembly Election Results 2025) వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)  రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)  చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.  మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ చిత్రంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. నిండుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం తనకు జరిగిందని ఆమె పరోక్షంగా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

Also Read :  పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే!

Swati Maliwal's Draupadi Post Goes Viral

Also Read :  స్థానిక ఎన్నికలకు సై....ప్రభుత్వానికి కలిసొచ్చేనా?

గతేడాది  కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడిని ఆమె ఈ విధంగా ప్రస్తావించారు.  కాగా 2024మేలో స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ నివాసంలోనే దాడి జరిగినట్టుగా ఆరోపణలు కలకలం రేపాయి. తనపై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడినట్టు ఆమె సంచలన ఆరోపణలు చేశారు.  కేజ్రీవాల్  ముందే తన పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించినట్టు అప్పట్లో ఆమె వెల్లడించారు. 

Also Read :  ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

Also Read :  ప్రచారంలో ఆ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. ఇంతకీ అతను గెలిచాడా.. ఓడాడా?

#national news in Telugu #Delhi assembly elections 2025 #today-news-in-telugu #latest-news-in-telugu #delhi assembly elections updates #aam-admi-party #swati-maliwal #bjp
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదా...

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment