Heavy Rain: భారీ వర్షం.. గోడ కూలి ఏడుగురు మృతి

బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వర్షం పెద్దఎత్తున కురవడం వల్ల బలమైన గాలులు వీయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
7 Dead After Hospital Compound Wall Collapses During Heavy Rain In Bengaluru

7 Dead After Hospital Compound Wall Collapses During Heavy Rain In Bengaluru

బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వర్షం పెద్దఎత్తున కురవడం వల్ల బలమైన గాలులు వీయడంతో 'బౌరింగ్ అండ్ లేడీ కర్జన్' అనే ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు ఆ ఆస్పత్రి వద్ద వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులగు గుర్తించారు. స్థానికుల సాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య కూడా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వాళ్లకి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ వైద్యులకు సూచించారు.  

Also Read :  పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్

Heavy Rain In Bengaluru

Also Read :  అసోం ఎన్నికల పోరు.. హిమంత వ్యూహం ఫలించేనా?

Advertisment
తాజా కథనాలు