Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

మహారాష్ట్రాకు చెందిన ఆర్యన్ శుక్లాని హ్యూమన్ క్యాలుక్యులేటర్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే లెక్కల్లో ఈ 14ఏళ్ల కుర్రాడు సూపర్ ఫాస్ట్. అత్యంత వేగంగా సంఖ్యలను కూడడం, తీసివేడం చేస్తుంటాడు. ఓకే రోజు 6 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్స్‌ రికార్డులు క్రియేట్ చేశాడు.

author-image
By K Mohan
New Update
aryan shukla

aryan shukla Photograph: (aryan shukla)

Aaryan Shukla: మహారాష్ట్రా (Maharashtra) కు చెందిన 14ఏళ్ల పిల్లవాడు రికార్డులు సృ‌ష్టించడంలోనే రికార్డ్ బ్రేక్ చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 6  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ (Guinness Book Of World Records) క్రియేట్ చేశాడు. అతని మైండ్ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ప్రయాణిస్తుందని చెప్పడంతో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్లా వయసు పద్నాలుగేండ్లు. అతనికి ఇంకో పేరు నిక్‌నేమ్ కూడా ఉంది అదే హ్యూమన్ క్యాలుక్యులేటర్. ఆర్యన్ టాలెంట్​ చూసి ప్రపంచమే అబ్బురపడింది.

Also Read: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!

14 Year Old Aryan Shukla Created Six Guinness Book

ఎందుకంటారా... 50 అంకెల సంఖ్యలను అత్యంత వేగంగా కూడి(కలిపి) టాస్క్ పూర్తిచేశాడు. అందుకుగాను గతేడాది ఆర్యన్ మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్​ కొల్లగొట్టాడు. దుబాయ్‌లో జరిగిన గిన్నిస్ రికార్డ్స్ పోటీలో శుక్లా 25.19 సెకండ్లలో ఈ ఫీట్​ను సాధించాడు. దీంతో మొత్తం ఆరు గిన్నిస్ రికార్డులు ఆర్యన్ పేరు మీద నమోదయ్యాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నా  సరే ఆర్యన్ సెకన్‌లో లెక్కేస్తాడు. అది మనవాడి టాలెంట్. లెక్కల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటోడు. 

Also Read: Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్!

శుక్లా 100 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి 30.9 సెకండ్ల ట్రైం మాత్రమే తీసున్నాడు. 200 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి1నిమిషం, 9.68 సెకండ్లు పట్టింది. 50  ఐదు అంకెల సంఖ్యలను కలపడానికి 18.71 సెకండ్లు, 20 అంకెల సంఖ్యను పదంకెల సంఖ్యతో భాగించడానికి 5 నిమిషాల 42 సెకండ్లు పట్టింది. రెండు ఐదంకెల సంఖ్యలను గుణించడానికి 51.69 సెకండ్లు, రెండు ఎనిమిది అంకెల సంఖ్యలను గుణించడానికి 2 నిమిషాల 35.41 సెకండ్ల టైం తీసుకున్నాడు. ఇలా గణితానికి సంబంధించిన ఆరు టాస్క్​లను ఒకే రోజు పూర్తి చేశాడు. దీంతో ఆరు రికార్డులు సొంతం చేసుకున్నాడు ఆర్యన్. అత్యంత వేగంగా లెక్కించడం ఆర్యన్ ప్రత్యేకత కాబట్టి తనని ముద్దుగా హ్యూమన్ క్యాలుక్యులేటర్ అని పిలుస్తున్నారు. అయితే తన కొడుక్కి ఈ టాలెంట్ ఎలా వచ్చిందోనని శుక్లా తండ్రి కూడా ఆశ్చర్యపోతున్నాడు. 

Also Read: ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం సంచలన నిర్ణయం!

ఆర్యన్ కేవలం 12ఏళ్ల వయస్సులోనే జర్మనీ 2022లో మెంటల్ కాలిక్యులేషన్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. అతను గతంలో అనేక అంతర్జాతీయ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. మెంటల్ క్యాల్యుకేషన్ విభాగాలలో అనే రికార్డులను ఈ పిల్లాడు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఆర్యన్ ప్రపంచవ్యాప్తంగా మానసిక కాలిక్యులేటర్ల సంఘం అయిన గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకడు కూడా. ఆర్యన్ ఫాస్ట్‌గా లెక్కలు చేయడానికి రోజూ 6 గంటలు ప్రాక్టీస్ చేస్తాడట. ఇలా అతని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు ఆర్యన్.

Also Read: 'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment