Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!

కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

New Update
AIDS

కేరళలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారు అని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఐవీ సోకిన వారు డ్రగ్స్ తీసుకునేవారని కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే అందరూ ఒకే ఇంజెక్షన్ సిరంజీని ఉపయోగించడం వల్ల వారంతా హెచ్ఐవీ బారిన పడినట్లు తేల్చారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

మరో 9 మంది డ్రగ్స్...

మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత.. ఈ హెచ్ఐవీ సోకిన వారంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటగా ఈ 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజీని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని.. అందుకే వారందరికీ హెచ్ఐవీ సోకినట్లు వెల్లడించారు. ఈ ఎయిడ్స్ సోకిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు హెచ్ఐవీ సోకిన 10 మంది వ్యక్తులను అధికారులు తమ పర్యవేక్షణలో పెట్టుకున్నారు. 

Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

2025 జనవరిలో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో మొట్టమొదట ఒక హెచ్ఐవీ రోగిని గుర్తించింది. ఈ కేసు బయటపడిన తర్వాత.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు  లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. హెచ్ఐవీ సోకిన వ్యక్తి ఉపయోగించిన సిరంజీని మరో 9 మంది కూడా ఉపయోగించడంతో ఎయిడ్స్ వ్యాప్తి చెందినట్లు తేలింది. ఇక దర్యాప్తులో భాగంగా వారి మెడికల్ రిపోర్ట్‌లు వచ్చినపుడు.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు షాక్ అయ్యారు.

మెడికల్ టెస్ట్‌లలో వారందరికీ హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో డ్రగ్స్ తీసుకునే వారిలో హెచ్ఐవీ సంక్రమణ పెరిగే ప్రమాదం ఉందని మలప్పురం జిల్లా వైద్యాధికారి ఆర్. రేణుక హెచ్చరికలు చేశారు. వాలంచేరిలో హెచ్‌ఐవీ సోకిన 10 మంది మాదకద్రవ్యాలకుకు బానిసలు అని.. దీనివల్ల వారి కుటుంబాలకు కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని.. హెచ్ఐవీ సోకిన కుటుంబాలను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Also Read:  Crime News: కుక్క టాయిలెట్‌‌ పోసిందని.. కారుతో గుద్దేశాడు!

kerala | malapuram | hiv | aids | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన (యూబీటీ) MP సంజయ్ అన్నారు. అది చెప్పడానికే RSS ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తర్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు.

New Update
Modi

శివసేన (యూబీటీ) కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సెప్లెంబర్‌లో రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. అందుకే ఆయన సడెన్‌గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ అన్నారు. గత పదేళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోడీ ఎప్పుడు వెళ్లలేదు.. కానీ ఆయన ఆకస్మికంగా ఈరోజు ఎందుకు వెళ్లారని సందేహం లేవనెత్తారు. తనకు ఉన్న సమాచారం మేరకు.. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుంది. ఇక ప్రధాని మోడీ కాలం ముగిసిందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ వారసుడిని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందన్నారు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రధాని మోడీ పీఎం హోదాలో తొలిసారి 2025, మార్చి 30న మహారాష్ట్ర నాగ్‎పూర్‎లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. RSS రూల్ ప్రకారం బీజేపీ నాయకుల్లో 74ఏళ్లు పైబడిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నిబంధన ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74వ సంవత్సరం నడుస్తోంది. సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టిన రోజు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనచేత ప్రధాని పదవికి రాజీనామా చేయిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రధాని పదవి అధిరోహించాల్సి ఉండే.. ఆయనకు 74ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో నరేంద్ర మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది. 

Also read: BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన

బీజేపీ ప్రధాని విషయంలో ఆర్ఎస్ఎస్ రూల్‌ను సంజయ్ రౌత్ లేవనెత్తారు. లోక్‌సభ టర్మ్ ప్రకారం మోదీ ప్రధానిగా మరో నాలుగేళ్లు కొనసాగే అవకాశం ఉంది. కానీ మధ్యలోనే బీజేపీ మరో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీ సెప్టెంబర్‎లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారని.. ఆ విషయం చర్చించడానికే ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‏ను కలిసి మోదీ విడ్కోలు చెప్పడానికే మోడీ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారని ఆరోపించారు. 

పదవి విరమణ గురించి మాట్లాడేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చాడన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ప్రధాని మోడీ ఇప్పట్లో రిటైర్ కారని.. ఇంకా చాలా సంవత్సరాలు దేశాన్ని పాలిస్తారని కౌంటర్ ఇచ్చారు. 2029లో మనం మళ్ళీ మోడీని ప్రధానమంత్రిగా చూస్తామని.. ఇప్పుడే ఆయన వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహా వృక్షం అని అభివర్ణించారు. అలాగే.. నాగ్‎పూర్‎లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‎కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 

#rss #rss-meet #shiv-sena #latest-telugu-news #pm modi #modi retirement plan #MP sanjay Raut
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు