mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట.

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు.

New Update
mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట.

ముఖేష్ అంబానీ తర్వాతి తరం వారి వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. పిల్లలు ముగ్గురూ రిలయన్స్ ఇండస్ట్రీలోని ఒకకో కంపెనీను చూసుకుంటూ తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. అయితే ఈ పని చేస్తున్నందుకు వీరికి కంపెనీ నుంచి జీతం మాత్రం రాదని చెబుతున్నారు. కేవలం బోర్డు సమావేశాలకు మాజరైనప్పుడు మాత్రమే సంస్థ ఫీజులు చెల్లిస్తుందట. అలాగే సంస్థ లాభాలపై కమీషన్‌నూ తీసుకుంటారట.ఈ విషయాన్ని షేర్ హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది.

2014లో కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా నియమితులైన ముకేశ్‌ భార్య నీతా అంబానీ కూడా ఇలాగే జీతం తీసుకోకుండా లాభాల మీద కమీషన్ మాత్రమే తీసుకునేవారుట. ఇప్పుడు పిల్లలు కూడా తల్లి బాటలోనే నడుస్తున్నారు. ఈ మేరకు ముకేశ్‌ సంతానమైన ఆకాశ్‌, ఇషా, అనంత్‌ అంబానీలను ఆర్‌ఐఎల్‌ బోర్డ్‌ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఇచ్చిన తీర్మానంలో ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే 2020-21 నుంచి ముకేశ్‌ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో లాభాలను సంతరించుకునేదాకా ఇంతేనని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముకేశ్‌ పిల్లలూ జీతాలు తీసుకోబోవడం లేదు.అయితే రిలయన్స్ ఇండస్ట్రీ చాలా పెద్దది. వారి వ్యాపారాలుకూడా మిలియన్ కోట్లలో నడుస్తాయి. లాబాలూ అలాగే వస్తాయి. దాన్ని బట్టి లాబాల మీద వచ్చే కమీషన్ కూడా కోట్లలోనే ఉంటుంది.

రిలయన్స్ కంపెనీ రీసెంట్ గా ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్ళపాటు కంపెనీ ఛైర్మన్​, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన ముగ్గురు పిల్లలను బోర్డ్​ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే తాజాగా ఈ నియామకానికి సంబంధించి షేర్​ హోల్డర్ల ఆమోదం కోసం పోస్టల్​ బ్యాలెట్​లను పంపించింది. ఇక ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ మధ్యనే కంపెనీ బోర్డ్​ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్​ లకు మాత్రం శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment