World Cancer Day: క్యాన్సర్‌కు ఆత్మ విశ్వాసమే ఆయుధం

నేడు వరల్డ్ క్యాన్సర్ డే. దీనిని నయం చేయాలంటే మొదటి దశలోనే గుర్తించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లలాని చెబుతున్నారు. దేశంలో ఏటా 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎందరో పిల్లలు కూడా మృత్యువాత పడుతున్నారు.

New Update
world cancer day

world cancer day Photograph: (world cancer day)

ప్రపంచంలో రోజురోజుకీ క్యాన్సర్ కేసులు (Cancer Cases) పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి (Life Style), ఆరోగ్య అలవాట్ల కారణంగా చాలా మంది ఈ ప్రమాదకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ ఏడాది దేశంలో కొత్తగా 15 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించి దాన్ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే కొంత వరకు కేసులు తగ్గుతాయన్నారు.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

ముందే గుర్తించకపోతే..

దేశంలో నమోదవుతున్న క్యాన్సర్‌ మరణాల్లో ఎక్కువగా పొగాకు, మద్యం, ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్నాయన్నారు. వీటిని ముందే గుర్తించి నయం చేయకపోతే కష్టమే అంటున్నారు. అందరూ కూడా క్యాన్సర్ గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కారు క్యాన్సర్ విషయంలో కీలక నిర్ణయాలు ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ మందులను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల ఎందరో పేద వారు క్యాన్సర్ నుంచి బయటపడతారని అంటున్నారు. 

క్యాన్సర్‌ను జయించినవారి సంఖ్య పెరగాలంటే దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. వీటిన్నింటి కంటే మించి ఆత్మ విశ్వాసం ఉండాలన్నారు. మన దేశంలో రోజుకి 200 మంది సర్విక్స్‌ క్యాన్సర్‌తో చనిపోతున్నారని, ఇలా అన్ని చూసుకుంటే దాదాపుగా 1600 మంది చనిపోతున్నారన్నారు. అలాగే అమెరికాలోలాగా.. భారతదేశంలో కూడా క్యాన్సర్‌ను నోటిఫయబుల్‌ డిసీజ్‌‌గా గుర్తించాలన్నారు. దీనివల్ల ఎంతమంది క్యాన్సర్‌ బాధితులున్నారు? ఏయే రకాల క్యాన్సర్లు ఉన్నాయనే? పూర్తి విషయాలు కూడా తెలుస్తాయన్నారు. క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారిలో చిన్నారులు కూడా ఎక్కువగానే ఉన్నారని దత్తాత్రేయుడు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pregnant: గర్భిణులు మొదటి మూడు నెలల్లో ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి

తల్లి కడుపులో 2వ నెల నుంచి నాడీ వ్యవస్థ, మూత్ర నాళం, కడుపు వంటి అవయవాలు అభివృద్ధి చెందుతాయి. 3వ నెల నాటికి జననేంద్రియాలు, గోళ్లు, కనురెప్పలు వంటి వాటి రూపకల్పన జరుగుతుంది. ఈ టైంలో తల్లి ఆరోగ్యవంతమైన పోషకాహారం తీసుకోవాలి.

New Update

Pregnant: గర్భం దాల్చినప్పటి నుంచి మొదటి మూడు నెలలు తల్లి శారీరకంగా, మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ కాలం శిశువు ప్రాథమిక అవయవాల అభివృద్ధికి అత్యంత కీలకం. తల్లి కడుపులో పిండం వేళ్లు, కాలి వేళ్లు, గుండె, నరాలు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలను అభివృద్ధి చేసుకునే దశలో ఉంటుంది. అలాగే రెండవ నెల నుంచి నాడీ వ్యవస్థ, మూత్ర నాళం, కడుపు వంటి అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మూడవ నెల నాటికి జననేంద్రియాలు, గోళ్లు, కనురెప్పలు వంటి వాటి రూపకల్పన జరుగుతుంది. ఈ సమయంలో తల్లి తీసుకునే పోషకాహారం, ఆరోగ్యవంతమైన జీవనశైలి శిశువు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. 

ప్రోటీన్‌లు అధికంగా ఉండే..

కాబట్టి, మంచి ఆహారం, పర్యావరణం, విశ్రాంతి అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. బయటి ఆహారాలను తప్పించాలి, ఎందుకంటే అవి హానికరమైన రసాయనాలను కలిగి ఉండవచ్చు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, కాల్షియం, ప్రోటీన్‌లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. సప్లిమెంట్లు తీసుకోవాలంటే వైద్యుడి సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ సమయంలో వాంతులు, తినే విషయంలో చిరాకు, వాసనల పట్ల అసహనత వంటివి సాధారణంగా ఎదురవుతాయి. ఈ కారణంగా తల్లులు ఒకేసారి ఎక్కువగా తినకుండా, తక్కువ తిండి ఎక్కువ సార్లు తీసుకోవడం ఉత్తమం. ఇది జీర్ణానికి, శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: కాఫీ పౌడర్‌తో అవాంఛిత రోమాలు తొలగించవచ్చా?

అంతేకాకుండా మంచి నిద్రను కొనసాగించడం అవసరం. నిద్ర వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించి, హార్మోన్ల సమతుల్యత కొనసాగుతుంది. శారీరకంగా శ్రమకలిగే పనులు, ఎక్కువ ఒత్తిడిని కలిగించే వాతావరణం నివారించాలి. వ్యాయామం చేయాలనుకుంటే వైద్యుడి అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా పొగతాగడం, మద్యం సేవించడం, ధూమపానం చేసే వ్యక్తులతో మినిమమ్ కనెక్ట్ కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ శిశువు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మొదటి మూడు నెలల జాగ్రత్తలు తల్లి-బిడ్డ ఆరోగ్యానికి పునాది వేసే సమయం. ఈ దశలో తీసుకునే మంచి నిర్ణయాలు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన బిడ్డ జననానికి దారి తీస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త

health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news | baby )

Advertisment
Advertisment
Advertisment