Obesity: 20 ఏళ్లకే పొట్టలు.. 80 శాతం దాటిన ఊబకాయులు.. బరువులో భారతీయుల రికార్డ్!

దేశంలో ఊబకాయుల సంఖ్య 80శాతం దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ వల్ల 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా 20 ఏళ్లకే పొట్టలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లోనే ఓవర్ బాడీ ఫ్యాట్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. 

New Update
మహిళల్లో ఒబేసిటీ ఎందుకు వస్తుందో తెలుసా..?

India 80 percent Obesity

Obesity: అధిక బరువు  పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. దేశంలో సగానికిపైగా జనం ఓవర్‌వెయిట్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. జంక్ ఫుడ్ కారణంగానే ఇండియాలో 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రవరం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

హార్మోన్ల మార్పుల కారణం..

జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా దేశంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. బాడీ ఊహించని రీతిలో బరువెక్కుతోంది. ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో ఊబకాయ సమస్య అధికంగా కనిపిస్తోంది. కేవలం 20 ఏళ్లు ఉన్న వ్యక్తికే పొట్ట ముందుకు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పుల కారణంగా ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. పిండి పదార్థాలు, షుగర్‌ ఐటెమ్స్‌, కొవ్వు, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారు. శారీరక శ్రమ తగ్గించారు. బద్దకం, మానసిక ఒత్తిడి పెరిగింది. దీంతో సరిగ్గా నిద్రలేకపోవడం, సామాజిక ఆర్థిక స్థితిగతులు, పర్యావరణ అంశాల వంటివి ఎన్నో ఊబకాయానికి దారితీస్తున్నాయని వైద్యులు తెలిపారు. 

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

ఐటీ సెక్టార్‌లో 80 శాతం మంది..

ఇక ఐటీ సెక్టార్‌లో వందకు 80 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో బాడీ ఫ్యాట్‌ పెరిగిపోయింది. అధికశాతం మంది ఐటీవారే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం తేలికవుతుంది. లేదంటే ఒబేసిటీ వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా ఊబకాయం వల్ల చురుకుదనం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్‌, జీర్ణసమస్యలు, హైకొలెస్ట్రాల్‌, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.  

Also read :  దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఊబకాయం సమస్యను నివారించవచ్చు. సమయానికి అవసరమైనంత ఆహారం తీసుకోంటే అధిక బరువు సమస్య ఉండదు. రోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం ద్వారా బాడీలో పేరుకున్న కేలరీలను కరిగించవచ్చు. పిండి, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువగా ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకుంటే ఒబేసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. రోజుకు 6-8 గంటల నిద్రపోవాలి. ఎక్కువసేపు కూర్చొకుండా కాస్త తిరుగుతూ పనులు చేయాలి. ఇలా చేస్తే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. రైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment