Epilepsy: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మూర్ఛ వ్యాధి న్యూరాన్లు లేదా మెదడు కణాలలో ఆకస్మిక మార్పుల వల్ల వస్తుంది. ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి. మూర్ఛ వ్యాధి పదే పదే రావడం వల్ల ఫిట్స్ కూడా వస్తుంది. మెదడుకు హాని కలిగించే అనేక కారణాల వల్ల మూర్ఛలు సంభవించవచ్చు.

New Update
Epilepsy

Epilepsy

మూర్ఛ రుగ్మత అనేది మెదడుకు సంబంధించిన నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందికి ఈ మూర్ఛ వ్యాధి ఉంది. మూర్ఛ (Epilepsy) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు అవగాహన, అపోహలను తొలగించే లక్ష్యంతో 2015లో అంతర్జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. మూర్ఛ అనేది దీర్ఘకాలిక మెదడు రుగ్మత. మూర్ఛ వ్యాధి న్యూరాన్లు లేదా మెదడు కణాలలో ఆకస్మిక మార్పుల వల్ల వస్తుంది.

Also Read :  కుంభమేళా వల్ల పడవలు నడిపే వ్యక్తికి రూ. 30 కోట్ల ఆదాయం..యోగి ఆదిత్య నాథ్

మెదడులో రక్తస్రావం:

ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి. మానసిక అనారోగ్యం కాదు, అంటు వ్యాధి కాదు. మూర్ఛ వ్యాధి పదే పదే రావడం వల్ల ఫిట్స్ కూడా వస్తుంది. మెదడుకు హాని కలిగించే అనేక కారణాల వల్ల మూర్ఛలు సంభవించవచ్చు. మూర్ఛ వ్యాధికి నిర్దిష్ట కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఈ వ్యాధి జన్యుపరమైన లోపాలు, మెదడు దెబ్బతినడం వల్ల వచ్చే అవకాశం ఉంది. తలకు బలమైన దెబ్బ, స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్, మెదడులో రక్తస్రావం, మెదడులోని రక్త నాళాల వైకల్యాలు, జనన గాయాలు, కొన్ని ఇతర ఇన్ఫెక్షన్లు మూర్ఛకు కారణమవుతాయి.

ఇది కూడా చదవండి: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు

తగిన వైద్య చికిత్స, ప్రభావవంతమైన మందులతో మూర్ఛను పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు సూచించిన కాలం పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. మూర్ఛ వ్యాధిని వీలైనంత త్వరగా నిర్ధారించి చికిత్స ప్రారంభించడం వల్ల మెదడుకు మరింత నష్టం జరగకుండా నిరోధించవచ్చు. తగినంత నిద్రపోవడం, కెఫిన్, ఎనర్జీ డ్రింక్స్ మొదలైన ఆహారాలకు దూరంగా ఉండటం, పుష్కలంగా నీరు తాగడం ద్వారా మూర్ఛను నివారించవచ్చు.

Also Read :  మలక్‌పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మత్తుమందు ఇచ్చి లేపేశారు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ చట్నీ రక్త నాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment