USA: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్.

New Update
Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

మాదక ద్రవ్యాలు వాడడం, తుపాకీని కొనుగోలు చేయడంలాంటి నేరాల మీద అమెరికా అధ్యక్షుడి కుమారుడు హంటర్ బైడెన్ ను ఫెడరల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. దీని మీద అతని తండ్రి, దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ కుమారుడి నేరారోపణల మీద జరిగిన విచారణనను తాను, తన భార్య అంగీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయినా కూడా తమ కుమారుడు అంటే తమకు అమితమైన ప్రేమే ఉంది అని చెప్పారు. తాను కూడా అందరిలాగే తండ్రిని అంటూ ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగా తమ కుమారుడిని చూసి తాము గర్వపడుతున్నామని తెలిపారు. హంటర్ తాను ఉన్న పరిస్థితుల నుంచి బటయకు రావడానికి చేసిన ప్రయత్నం మమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తుందని జో బైడెన్ అన్నారు.

హంటర్ బైడెన్ డెలావర్ రాష్ట్రంలో కొకైన్‌ ను వినియోగించినట్లు, తుపాకీని కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు తుపాకీ కొనడానికి అబద్ధం చెప్పినట్టు కూడా తేలింది. డెలావర్ రాష్ట్రం ఫెడరల్ చట్టాల ప్రకారం ఇవన్నీ శిక్షార్హమైన నేరాలు. హంటర్ చేసిన ఈ పనులు నిరూపించబడడంతో ఫెడరల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.మాదకద్రవ్యాల వినియోగం గురించి ఫెడరల్ స్క్రీనింగ్ ఫారమ్‌లో అబద్ధం చెప్పడం కూడా దోషిగా తేలింది.

54 ఏళ్ళ హంటర్ తన నేరాల మీద జరిగిన విచారణపై పైకోర్టుకు అప్పీల్‌కు వెళుతున్నారు. దీనిపై తండ్రి జోబైడెన్ స్పందిస్తూ తాము అప్పీల్‌కు వెళుతున్నప్పటికీ హంటర్ విచారణ ఫలితాన్ని తాము అంగీకరిస్తున్నామని తెలిపారు. హంటర్‌కు తాను, తన భార్య జిల్ ఎప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. మా కుటుంబసభ్యులు అందరూ అతనికి మద్దతునిస్తామని తెలిపారు. అది ఎప్పటికీ మారదు అంటూ భావోద్వేగం కూడిన ట్వీట్‌ను చేశారు. తుపాకీ కొనుగోలు, మాదక ద్రవ్యాల వినియోగం మాత్రమే కాకుండా హంటర్ మీద పన్నులను ఎగవేసిన ఆరోపణలు కూడా ఉననాయి. దీని మీద కూడా ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతోంది.

Also Read:Yemen: యెమెన్‌లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌పై పవన్ సంచలన ప్రకటన

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

 

Live Breakings | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu

  • Apr 13, 2025 13:29 IST

    మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌పై పవన్ సంచలన ప్రకటన

    మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.



  • Apr 13, 2025 11:01 IST

    అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

    మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్థరాత్రి ఆలయ తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేసింది ఓ 30 మంది ఉన్న గుంపు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడికి దిగారు.

    temple
    temple

     



  • Apr 13, 2025 10:04 IST

    తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

    తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



  • Apr 13, 2025 10:04 IST

    నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి

    నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు పల్నాడు జిల్లా గన్నవరంకు చెందిన తల్లి రాజేశ్వరి, కూతురు సాయివేదశ్రీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     



  • Apr 13, 2025 10:02 IST

    రాష్ట్రపతి బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ బిల్లుల మీద మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రపతి గడువును సుప్రీంకోర్టు నిర్దేశించడం ఇదే మొదటిసారి.

    Supreme Court
    Supreme Court

     



  • Apr 13, 2025 09:11 IST

    చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

    ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

    Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన 'SRH' ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!



  • Apr 13, 2025 09:10 IST

    రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

    వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.

    Special Trains
    Special Trains

     



  • Apr 13, 2025 09:10 IST

    భారత కంపెనీలపై రష్యా దాడులు

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. 

    ukraine
    Russia Attacks On Indian Medicine Warehouse

     



  • Apr 13, 2025 09:09 IST

    ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి

    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

    accident
    accident

     



  • Apr 13, 2025 09:08 IST

    వన్డేల్లో కీలక మార్పు.. ఒక బంతితోనే..

    క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

    cricket
    One day Cricket

     



  • Apr 13, 2025 07:52 IST

    వక్ఫ్‌ చట్టం వద్దని నిరసనలు.. ముగ్గురు మృతి

    వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముర్షిదాబాద్‌‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని కాల్చి చంపేశారు. మరోవైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు. 

    Waqf Bill
    Waqf Bill

     



  • Apr 13, 2025 07:52 IST

    సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

    పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

    AP
    Paster Praveen Case Briefing

     



  • Apr 13, 2025 07:51 IST

    దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

    దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి.

    Terrorists and Army
    Terrorists and Army

     



  • Apr 13, 2025 07:50 IST

    చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

    సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

    ap
    Mark Shankar

     



  • Apr 13, 2025 07:50 IST

    ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!

    యజమాని స్వగ్రామానికి వెళ్తూ పార్కింగ్‌లో ఉన్న కుక్కను చూడమని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. కుక్క ఏడుస్తుండటం వల్ల సీసీటీవీ చెక్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

    Pune dog rape
    Pune dog rape Photograph: (Pune dog rape)

     



  • Apr 13, 2025 07:49 IST

    ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

    చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. అలాగే ఎక్కడి వాళ్లను అక్కడే లాక్ చేసేసింది.

    china
    china

     



  • Apr 13, 2025 07:49 IST

    వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

    మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

    whatsapp
    whatsapp Photograph: (whatsapp)

     



Advertisment
Advertisment
Advertisment