Asaduddin Owaisi: ఏపీలో జగన్‌ పాలనపై అసదుద్దీన్‌ ఏమన్నాడంటే.!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు.

New Update
Asaduddin Owaisi: ఏపీలో జగన్‌ పాలనపై అసదుద్దీన్‌ ఏమన్నాడంటే.!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నా అవి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేవని ఎద్దేవా చేశారు. మరోవైపు అసదుద్దీన్‌ ఏపీ ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో గతంలో కంటే మంచి పాలన అందిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే బాగుంటుందన్నారు.

జగన్‌ మోహన్‌ రెడ్డిని నమ్మొచ్చన్న ఆయన.. చంద్రబాబును మాత్రం అస్సలు నమ్మకూడదన్నారు. చంద్రబాబు నాయుడు సొంత మామను నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. మరోవైపు రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీ ఏపీలో కూడా పోటీ చేస్తుందన్నారు. 170 స్థానాల్లో పోటీ చేయబోమన్న ఆయన.. కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అవి ఏఏ స్థానాలు అనే విషయంలో మాత్రం ఆయన క్లారీటి ఇవ్వలేదు. మరోవైపు తెలంగాణలో తాము బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయబోతున్నట్లు అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.

మజ్లిస్‌ పార్టీ పోటీ చేస్తున్న ప్రాతాల్లో ప్రజలు మజ్లిస్‌కు మాత్రమే ఓటు వేయాలన్నారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలించాలని ఎంపీ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని హైదరాబాద్ ఎంపీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు నెలలకో సీఎం మారుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో హింస చెలరేగే అవకాశం అధిక శాతం ఉందని అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment