USA Ban Transgenders: అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లపై నిషేధం

ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు. 

New Update
usa

US Army Bans transgenders

USA Ban Transgenders: అమెరికా(America) అధ్యక్షుడికి ట్రాన్స్ జెండర్లు అంటే ఎందుకో ఇష్టం లేదు. ఎన్నికల దగ్గర నుంచి వారి మీద నిషేధం ఉంటుందని చెబుతూనే ఉన్నారు. తాను అధికారంలోకి రాగానే మొట్టమొదటగా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు ఉండకుండా చట్టాన్ని తీసుకువస్తానని చెప్పారు అన్నట్టుగానే ఆ ఫైల్ మీద మొదటి రోజునే సంతకం చేశారు. దీంతో అమెరికా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లను నిషేధించారు. ఇప్పుడు తాజాగా అమెరికా మిలటరీ(US Military)లో కూడా ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించినట్టు సైన్యం ప్రకటించింది. 

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

ఏ రకంగానూ ఉండడానికి వీలులేదు..

ఈ నిషేధానికి సంబంధించి అమెరికా మిలటరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ట్రాన్స్‌జెండర్‌లు సైన్యంలో చేరడాన్ని అమెరికా మిలిటరీ విభాగం నిషేధించింది. అలాగే సర్వీసులో ఉండగా లింగమార్పిడి కూడా అనుమతించమని తేల్చి చెప్పింది. ఈ రేలు వెంటనే  అమల్లోకి వస్తుందని తెలిపింది.  అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను మేం గౌరవిస్తాం కానీ తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భావించే వారి నియామకాలను మాత్రం  ఆపేస్తున్నామని చెప్పింది. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చేయించుకోవడానికి సంబంధించిన వైద్య ప్రక్రియలను నిలిపివేస్తున్నామని పోస్ట్ లో రాసుకొచ్చారు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలటరీ ఉన్నవారిని మాత్రం కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు వారి మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఉన్నవారు కూడా మానేసి వెళ్ళిపోయేలా రూల్స్ తీసుకువచ్చారు. 

Also Read: USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Israel-Gaza: గాజాను ఎడారిగా మార్చేయండి.. కుక్కల్నీ కూడా వదలొద్దు!

అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.

New Update
12

గాజాను ఇజ్రాయేల్ సైనికులు ఎడారిగా మారుస్తున్నారా? పాలస్తీనియన్లకు అక్కడ నిలువ నీడ లేకుండా చేస్తున్నారా? వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారా? నివాసానికి పనికి వచ్చే ప్రతి భవనాన్ని కూల్చి వేస్తున్నారా? వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంతమంది ఇజ్రాయేల్ సైనికులు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాలస్తీనియన్లు తిరిగి రాలేని విధంగా వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని సైనికులు అంటున్నారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

ఇప్పటికే గాజాలోని దాదాపు 50 శాతం భూభాగాన్ని ఇజ్రాయేల్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్‌గా మారుస్తోంది. హమాస్‌ నాశనం చేసిన తర్వాత గాజాలో భద్రతా నియంత్రణ తమదే అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. కాగా, కూల్చివేతల్లో పాల్గొన్న ఒక సైనికుడు మాట్లాడుతూ.. ‘వారు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదు.. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు’ అని అన్నాడు. ఆ నేల బంజరు భూమిగా మారిపోతోందని ఆయన చెప్పాడు.

Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

వేలాది మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయేల్ బఫర్ జోన్‌గా మార్చింది. ఈ జోన్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని  ఇజ్రాయేల్ సైనికులు తెలిపారు. బఫర్ జోన్‌ను కిల్‌ జోన్‌గా మార్చామని మరో సైనికుడు వెల్లడించాడు ‘మాపై దాడిచేసి చంపడంతో మేం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు వారిని చంపుతాం. కేవలం వారిని మాత్రమేకారు వారి భార్యలను, చిన్నారులు, పిల్లులు, కుక్కలను కూడా చంపుతున్నాం’ అని ఇంకో సైనికుడు అన్నాడు.

‘ఇజ్రాయేల్ సరిహద్దుల్లోని బఫర్ జోన్‌లోదాదాపు గాజా పౌరులు ఖాళీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఇళ్లను లేదా శిథిలాల తొలగింపునకు సంబంధించిన మిషన్లను ప్రారంభించాం’ అని చెప్పాడు. ఇది మా దినచర్య అని వివరించాడు. ‘ప్రతి ప్లాటూన్‌కు ఐదు, ఆరు లేదా ఏడు ప్రదేశాలు, ఏడు ఇళ్లు కేటాయిస్తారు.. ఉదయం లేచినప్పటి నుంచి అక్కడే మేము పని చేయాలి. ధ్వంసం చేస్తున్న ప్రదేశాల గురించి లేదా ఎందుకు చేస్తున్నామో మాకు పెద్దగా తెలియదు. బహుశా ఇవి చట్టబద్ధమైనవి కావు అని నేను భావిస్తున్నాను’ అని ఆ సైనికుడు వివరించారు. అయితే, అక్కడ ఎవ్వరూ ఉండకూడదని భావిస్తోన్న ఇజ్రాాయేల్.. పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Also Read: BIG BREAKING: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!

Also Read: South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!

hamas | gaza | israel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment