USA and Talibans: అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఖైదీగా ఉన్న అఫ్గాన్ ఫైటర్.. ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Talibans and USA

Talibans and USA

USA and Talibans: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాకు, తాలిబన్ల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలోని ఓ జైల్లో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అఫ్గాన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్‌ను విడుదల చేస్తే.. తమ వద్ద ఉన్న  ఇద్దరు అమెరికా ఖైదీలను విడుదల చేస్తామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం అరెస్టయిన అఫ్గాన్ ఫైటర్ ఖాన్‌ మహమ్మద్‌ ఇప్పుడు కాలిఫోర్నియాలోని ఓ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  

Also Read: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం

అమెరికా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం..

అయితే అమెరికాతో తాము జరిపిన చర్చల తర్వాత ఈ సమస్య పరిష్కారమైందని తాలిబన్ అధికారులు తెలిపారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఖైదీలలో ఒకరైన ర్యాన కార్బెట్ కుటుంబం మీడియాతో మాట్లాడింది. 

'' ర్యాన్ మా నుంచి దూరమై 894 రోజులయ్యింది. ఇవి తమ జీవితంలో సవాళ్లతో కూడుకున్నవి. 2022లో మేము విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తాలిబన్లు ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చివరికీ ఇన్నేళ్లకు తిరిగి ర్యాన్‌కు తమకు అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలని''ర్యాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా తమ దేశస్థులని విడిపించేందుకు తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా గతంలో తెలిపారు. ఇటీవలే బాధిత కుటుంబ సభ్యులతో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తాలిబన్ల చెరలో ఉన్నటువంటి తమ వాళ్లని విడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుదిదశకు వచ్చాయని చెప్పారు. దీంతో అఫ్గాన్‌లో ఉంటున్న అమెరికా ఖైదీల కుటుబాలు.. తమవారి కోసం ఎదురుచూస్తున్నాయి.   

Also Read:  మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment