Putin: అలా జరిగితే అణుయుద్ధమే.. రష్యా సంచలన ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హత్య చేయాలనే కుట్రకు పాల్పడిదని అమెరికా జర్నలిస్ట్ టకర్‌ కార్ల్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పుతిన్ హత్యకు ఎలాంటి కుట్ర పన్నినా అణుయుద్ధంతో పాటు తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది.

New Update
Russia President Putin

Russia President Putin

Putin: అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హత్య చేయాలనే కుట్రకు పాల్పడిదని అమెరికా జర్నలిస్ట్ టకర్‌ కార్ల్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ పోడ్‌కాస్ట్‌లో ఆయన దీని గురించి మాట్లాడారు. హత్య కుట్రకు సంబంధించి ఆరోపణలు చేసినప్పటికీ దానికి సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడలేదు. అయితే టకర్‌ కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలపై రష్యాన్ పార్లమెంటులో చర్చనీయాంశమైంది. 

Also Read: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దీనికి స్పందించిన స్పీకర్ వయచెస్లాన్‌ వొలొదిన్.. పుతిన్ హత్యకు ఎలాంటి కుట్ర పన్నినా అణుయుద్ధంతో పాటు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇంతవరకు అమెరికా స్పందించలేదు. దీంతో అమెరికా తీరుపై కూడా వొలొదిన్ విమర్శలు చేశారు. రోజుల గడుస్తున్న కూడా అందరూ మౌనంగా ఉన్నారని.. దీనికి అమెరికా తన వైఖరిని చెప్పడం లేదని విమర్శలు చేశారు.  

Also Read: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్

రష్యా సంచలన ప్రకటన

పుతిన్‌ హత్య చేయాలని కుట్ర పన్నడం నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమని వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనిపై అంతర్జాతీయ సంస్థలు కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. గతంలో హంగేరి ప్రధానమంత్రి విక్టర్‌ ఆర్బాన్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికోలపై కుట్రలు జరిగినట్లు వొలిదిన్ తెలిపారు. అమెరికాలో ఎన్నికల వేళ ట్రంప్‌పై జరిగిన దాడిని కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే పుతిన్‌ భద్రతపై ప్రమాదం పొంచి ఉన్న వేళ అలెర్ట్‌గా ఉండాలని రష్యన్ స్పెషల్ సర్వీసెస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.   

Also Read:  క్లాస్ రూమ్లో స్టూడెంట్తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి! .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

Also Read: ఐసీసీ సీఈవో రాజీనామా.. పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడమే కారణమా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.

New Update
Jai shankar

Jai shankar

ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .  

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్‌ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు. 

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment