Zelensky: చర్చలకు పుతిన్ భయపడుతున్నారు: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

యుద్ధం ముగింపు పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తోసిపుచ్చారు.దీని పై జెలెన్‌ స్కీ స్పందిస్తూ బలమైన నాయకులన్నా..చర్చలన్నా పుతిన్‌ కు భయమని తెలిసిపోయిందని అన్నారు.

author-image
By Bhavana
New Update
Zelensky: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్‌!

మూడేళ్లుగా ఉక్రెయిన్‌ -రష్యా ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధం ముగింపు పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తో చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తోసిపుచ్చారు.దీని పై జెలెన్‌ స్కీ స్పందిస్తూ బలమైన నాయకులన్నా..చర్చలన్నా పుతిన్‌ కు భయమని తెలిసిపోయిందని అన్నారు.

Also Read: Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. బలమైన నాయకులకు , చర్చలకు పుతిన్‌ భయపడతారని మరోసారి తేలిపోయింది. యుద్ధాన్ని పొడిగించడానికి ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వేసే ప్రతి పని కూడా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేవిగా ఉంటాయి. 2014 లో రష్యా మాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించింది.

2022 లో అది పూర్తి స్థాయి దండయాత్రగా మారింది. ప్రస్తుతం శాంతిని సాధించే అవకాశం ఉన్నప్పటికీ..ఆయన ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ప్రపంచంలో స్థిరత్వానికి భంగం కలిగించేందుకు ఆయన వద్ద సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి. కానీ, బలమైన నాయకుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేనంత బలహీనంగా ఉన్నారు.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

అందుకే మనం నిర్ణయాత్మకంగా , ఐక్యతతో వ్యవహరించాలి. శాంతిని విశ్వసించేవారంతా కలిసి రష్యా పై ఒత్తిడి పెంచాలి. అప్పుడే మనం నిజమైన శాంతిని పొందగలం అని జెలెన్‌ స్కీ అన్నారు. రష్యా ఉక్రెయిన్‌ ల మధ్య శాంతిని నెలకొల్పే చర్చలు సాధ్యమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. అయితే జెలెన్‌ స్కీతో ఇది కుదరదని వ్యాఖ్యానించారు. 

చర్చలు జరిపి, రాజీపడాలనే కోరిక ఉంటే అందుకు మేము సిద్ధం. కానీ ,ఆ దేశాధ్యక్షుడితో మాత్రం చర్చలు సాగవు. మా ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రయత్నాలుంటాయి. పాశ్చాత్య దేశాలు కీవ్‌ కు మద్దతు నిలిపివేస్తే ఈ పోరాటం రెండు నెలల్లోనే ముగిసిపోతుంది అని పుతిన్‌ తెలిపారు. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. 

ఇటీవల ఆయన మాట్లాడుతూ యుద్ధం అనేది అసలు మొదలుకాకూడదని..తానుఅధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌ లో సంక్షోభం వచ్చేది కాదన్నారు.త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. శాంతి చర్చలకు ఇరు దేశాధ్యక్షులు ముందుకు రావాలన్నారు.అయితే కీవ్‌ లో శాంతి ఒప్పందం పై చర్చలకు రష్యా రాకపోతే వారి పై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు.

Also Read:  Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

Also Read: Hussain Sagar Boat Fire: హుస్సేన్‌సాగర్‌లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

తాను పట్టుకున్న కుందేలుకు మూడ కాళ్ళు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరైనా తగ్గాల్సిందే కానీ తాను తగ్గేదే లే అంటున్నారు. తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుని..ఆ దేశానికి షాక్ ఇచ్చారు.  

New Update
tariffs

USA-China

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి పోయింది.  చైనా వెనక్కు తగ్గకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆ దేశంపై విధిస్తున్న సుంకాలను 104 శాతం పెంచి భారీ షాక్ ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ కార్యదర్శి ప్రకటించారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధింారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రపం మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | usa | china | trump tariffs

Also Read: PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment