/rtv/media/media_files/2025/04/06/8aXgPMd4qvGF8vAzVgQ9.jpg)
britan
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.ఈ మేరకు పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్ ఎర్టీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా..అబ్తిసామ్ మొహమ్మద్ షెఫీల్డ్ సెంట్రల్ కు ఎంపీగా ఉన్నారు.వీరు శనివారం లుటాన్ నుంచి ఇజ్రాయెల్ కు వెళ్లారు.వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. ఆ తరువాత కొంత సమయం తర్వాత వారిద్దరిని విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమ వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది.
అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ చర్య పై లామీ స్పందిస్తూ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశా.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య కాల్పుల విరమణ,గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read:Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు
israel | uk | britan | mp | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates