Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్‌ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!

కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు.

New Update
canada

canada

త్వరలో జరగబోయే మా దేశ ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయంటూ కెనడా ఇంటెలిజెన్స్ విభాగం సంచలన ఆరోపణలు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో కెనడా ఈ ఆరోపణలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కెనడాలో ఏప్రిల్ 28న ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Also Read: Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

ఈ క్రమంలో విదేశీ శక్తులు తమ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్  మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు.‘ప్రస్తుత ఎన్నికల్లో కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను ఉపయోగించే అవకాశం ఉంది.

Also Read: EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 తన ప్రయోజనాలకు  అనుకూలమైన కథనాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను చైనా వినియోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మోసపూరిత మార్గాల ద్వారా కెనడాలోని చైనీయులు జాతి, సాంస్కృతిక, మతపరమైన వర్గాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది’ అని లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు.

అలాగే, ‘భారత ప్రభుత్వం కూడా కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు ఆరోపించింది. కెనడా కమ్యూనిటీలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో దాని భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నించవచ్చు’ అని కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ ఆరోపించారు. అయితే, కెనడా చేసిన ఆరోపణలను భారత్, చైనాలు తోసిపుచ్చాయి. ఆ దేశం ఆరోపణల్లో కొత్తమే లేదని పేర్కొన్నాయి.

అటు, రష్యా, పాకిస్థాన్‌లపై కూడా లాయిడ్ ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లలో తన నెట్‌వర్క్ వ్యాప్తికి రష్యా ప్రయత్నిస్తోందని కూడా చెప్పారు. ‘ఈ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి కెనడియన్లను లక్ష్యంగా చేసుకుని విదేశీ సమాచార తారుమారు, జోక్యం చేసుకునే కార్యకలాపాలను అవకాశవాదంగా నిర్వహించే అవకాశం ఉంది’ అని ఆమె అన్నారు.

కాగా, ఖలీస్థాన్ ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత్‌కు కెనడా అంటగట్టే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ప్రకటన చేయడంతో ఆ విషయం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

 దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి తెరలేచింది. ట్రూడో ఆరోపణలు ఖండించిన ఢిల్లీ.. సమాచారం ఇస్తే దర్యాప్తు చేపడతామని తెలిపింది.

Also Read: TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!

Also Read: BIG BREAKING: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సీక్రెట్స్ లీక్.. అసలేం జరిగిందంటే?

 

canada | bharat | china | elections | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Tariffs

భారత్ సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో..వాషింగ్టన్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ వీటిని అనౌన్స్ చేయనున్నారు. వీటి వల్ల అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం ఏటా 600 బిలియన్‌ల నుంచి 700 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. 

భారత్, చైనాలతో పాటూ ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపు ప్రారంభం అవుతుంది. రేపటి రోజును అమెరికా లిబరేషన్ డే అని ట్రంప్ ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వరల్డ్ లో అన్ని దేశాలకు తాము తక్కువ సుంకాలు విధిస్తున్నా...అవి మాత్రం అమెరికా దగ్గర నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని..ఏ దేశం ఎంత టారీఫ్ విధిస్తే తామూ అంతే విధిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. మిత్ర దేశాలైన భారత్ లాంటి వాటికి కూడా ఈ సుంకాల మోత తప్పదని ట్రంప్ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా, మంచి వాడిగా ఉంటానని తెలిపారు. ఇన్నాళ్ళు తాము చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం..కానీ ఇక మీదట అమెరికాను దోచుకోనివ్వమని మరోసారి చెప్పారు ట్రంప్. 

అమెరికాకు శత్రుదేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ద్రోహం చేశాయని ట్రంప్ అంటున్నారు. దశాబ్దాలుగా అవి మిమ్మల్ని దోచుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని దేశాలు అమెరికాను దోచుకున్న దానికంటే ఇప్పుడు తాము విధిస్తున్న సుంకాలు ఎంతో తక్కువని ట్రంప్ సమర్ధించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటిపైనా మా వాణిజ్య సుంకాలు అమలవుతాయని చెప్పారు. 

సుంకాల కోత..

టారీఫ్ లవిషయంలో మిగతా దేశాల మాట ఎలా ఉన్నా...భారత్ మాత్రం అమెరికాకు ఎదురు తిరగదల్చుకోలేదని తెలుస్తోంది. సుంకాల విషయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారత్ వాటిని సమర్థిస్తూ వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఇలానే ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్..ట్రంప్ ను వెనకేసుకుని వచ్చారు. దాని తరువాత భారత ప్రభుత్వం అమెరికాతో  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చింది కూడా. దాని బట్టి అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించే దిశగా ఇండియా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. 

భారత్ పై ప్రభావం..

విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకం  విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది.  అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషినరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగకుండా ఉండడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని చూస్తోంది. మనం తగ్గితే ఆటోమేటిక్ గా అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుంది.

today-latest-news-in-telugu | usa | trump tariffs | india | china

Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..

Advertisment
Advertisment
Advertisment