America Flight Accident: బ్లాక్‌ బాక్స్‌ దొరికింది..మిస్టరీ వీడుతుందా?

వాషింగ్టన్‌ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు

New Update
Flightt

వాషింగ్టన్‌ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తును చేపట్టింది. శుక్రవారం నాటికి 28 మంది మృతదేహాలను గుర్తించగా, 41 మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీశారు. 

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

విమానం నది అడుగుభాగంలో ఉన్నందున మిగతా మృతదేహాలు ఇంకా లభించలేదు. బ్లాక్ బాక్స్ లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల అసలు కారణం బయటపడే అవకాశం కనపడుతుంది. 

Also Read: Budget 2025: నేడే బడ్జెట్ విడుదల.. ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే?

బ్లాక్ బాక్స్ దొరికింది..కానీ...

ఎన్‌టీసీబీ సభ్యుడు టాడ్ ఇన్మాన్ మాట్లాడుతూ.. “బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అది తేమతో నిండిపోయింది. దానిలోని డేటాను పూర్తిగా విశ్లేషించడానికి కొన్ని రోజులు పడుతుంది” అని తెలిపారు. ఈ ప్రమాదానికి హెలికాప్టర్ కారణమా? లేక ఇతర సాంకేతిక లోపమా? అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రమాదం తర్వాత విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం కాన్సాస్ సిటీ నుండి వాషింగ్టన్ కు వస్తోంది.ఈ విమాన ప్రమాదంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “ఆకాశం నిర్మలంగా ఉన్నా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? హెలికాప్టర్ ఎందుకు విమానం వైపుగా కదిలింది? పైలట్ ఎందుకు తప్పించుకోలేకపోయాడు?” అని ప్రశ్నించారు. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నారని సమాచారం. వైట్ హౌస్ నుండి విమానాశ్రయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు వస్తుంది.

Also Read: Ukrain: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్‌ సైనికులు!

Also Read: AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ సైన్యాధిపతి!

పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.

New Update
 Pakistan army chief Asim Munir

Pakistan army chief Asim Munir

పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ పాత్ర ఉందని పేర్కొన్న భారత్‌..దాయాది దేశం పై చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాక్‌ నేతలు భారత్‌ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్‌ సైన్యాధిపతి ఆసిం మునీర్‌ మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కారు.

Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.మతంఆచారాలు,సంప్రదాయాలు, ఆలోచనలు,ఆకాంక్షల్లో హిందూ ,ముస్లింలు వేర్వేరు.వీటి ఆధారంగానే రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడింది.పాకిస్తాన్‌ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

వాటిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ పేర్కొన్నారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాక్‌ మిలిటరీ అకాడమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు ప్రవాస పాకిస్థానీల తొలి సదస్సులోనూ మునీర్‌ ఇదే విధంగా మాట్లాడారు.

మనది ఒక దేశం కాదని,రెండు దేశాలన్నారు.కశ్మీర్‌ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానిచారు.ఇలా మాట్లాడిన కొన్ని రోజుల్లోనే పహల్గాంలో ముష్కరులు పాశవిక దాడులకు పాల్పడ్డారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హిందువుల ఊచకోత తర్వాత, భారత్ .. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించడం, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇవి పాకిస్తాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఏ క్షణమైనా భారత్ తో యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.  ఒకవేళ భారత్ తో యుద్దం సంభవిస్తే సహాయం చేయాలని కోరారు.  అందుకు చైనా కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ వెల్లడించారు.  భారత్ తమపై ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఉగ్రవాద దాడిపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్‌ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్‌ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన ఈ ఊచకోతలో, 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని ఉగ్రవాదులు చంపేశారు.

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Also Read: BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

pak | army | chief | Asim Munir | bharat | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment