Deportation: అమెరికా సంచలన నిర్ణయం.. మరో 487 మంది భారత విద్యార్థులు వెనక్కి

అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతోంది. అయితే మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్‌పై భారత్‌తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

New Update
Deportation

Deportation

అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతోంది. ఇప్పటికే రెండుసార్లు అమెరికా నుంచి భారతీయులను పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్‌పై భారత్‌తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 

Also Read: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!

ఇటీవల వెనక్కి పంపిన భారతీయులకు సంకెళ్లు వేసి పంపించండం దుమారం రేపింది. దీంతో డిపోర్ట్‌ చేసేవారిని గౌరవంగా పంపాలని భారత్‌ అమెరికాను కోరింది. త్వరలోనే రాష్ట్రాలకు ఈ అంశంపై మార్గదర్శకాలు కూడా జారీ చేయనుంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్.. 100 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించింది. 

Also Read: కెనెడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?

ఇదిలాఉండగా అమెరికాలోని హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20, 407 మంది భారతీయుల దగ్గర అమెరికాలో నివసించడానికి కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. అందులో 17,940 మందిని తిరిగి ఇండియా పెంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్భందంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దశల వారిగా అక్కడ ఉంటున్న వారిని వెనక్కి పంపిస్తున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్‌ సంచలన కామెంట్స్‌..

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.

New Update
Zelensky

Zelensky

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

Ukraine Comments On Crimea

క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump 

Advertisment
Advertisment
Advertisment