America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్‌!

అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

New Update
indians from us

indians from us Photograph: (indians from us )

అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా..కొందరు భారతీయులను ఇటీవల పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాలు భారత్‌ కు రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Ayodhya Satyendra Das: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

అమెరికా చేపడుతోన్న డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్‌ కు తీసుకుని వచ్చారు. ఈ వ్యవహారం పై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ..అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపింది.దీంతో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

మరో వైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.గడిచిన 15ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734 గా ఉండగా..2019 లో గరిష్ఠంగా2042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది.

దిగజార్చాలనే ఉద్దేశంతోనే...

అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్‌సర్‌ లో దించడం పై తాజా వివాదం కొనాసగుతోంది.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్‌సర్‌ లో దించుతున్నారని పంజాబ్‌ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా ఆరోపించారు, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించిన ఆయన...ఈ విమానాలను అహ్మదాబాద్‌ లో ల్యాండింగ్‌ చేయాలని అన్నారు.

Also Read: Indigo Valentines Day Sale: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!

Also Read: Trump-Hamas: ట్రంప్‌ వార్నింగ్‌ ని పట్టించుకోని హమాస్‌...బందీలను విడుదల చేసేదే లేదంటూ ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment