న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్‌లో కాల్పులు..

న్యూ ఆర్లీన్స్ సంఘటన జరిగిన రోజునే అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. న్యూయార్క్‌లో కూడా దుండుగుల అటాక్ జరిగింది. అక్కడి క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా మరో 11 మంది గాయపడ్డారు.

New Update
కాల్పులు

న్యూయార్క్ లో కాల్పులు జరిగిన ప్రదేశం

2025 మొదలవుతూనే అమెరికాకు బ్యాడ్ డేస్‌ను మోసుకొచ్చింది. న్యూ యర్ ఈవ్‌లో రెండు చోట్ల అటాక్స్ జరగడం ఆందోళనకు దారితీస్తోంది. న్యూ అర్లీన్స్‌లో పిక్ అప్ ట్రక్ జనాల మీదకు దూసుకెళ్ళడం, ఆతరువాత కాల్పులు జరపిన ఘటనలో 15 మంది చనిపోయారు మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఇందులో నిందితుడు టెక్సాస్‌కు చెందిన  షంషుద్దీన్ జబ్బార్ అమెరికన్ సిటిజెన్ అయిన్పటికీ ఉగ్రవాది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జబ్బార్‌‌ను ఐసీస్ లోన్ ఉల్ఫ్ కింద భావిస్తున్నారు. ఇతనికి సైనిక నేపథ్యం ఉన్నప్పటికీ ఉద్యోగం ఉంచి తొలగించబడ్డాడని చెబుతున్నారు. తన కుటుంబాన్ని కూడా న్యూ ఆర్లీన్‌ దాడిలో మట్టుబెట్టడానికి జబ్బార్ చూశాడని పోలీసులు తెలిపారు. 

Also Read: UN: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్

 

న్యూయార్క్‌లోనూ కాల్పులు..

ఇప్పుడు అదే రోజు ఇంచు మించు అదే సమయానికి న్యార్క్ లో జరిగిన మరో అటాక్ గురించి బయటకు వచ్చింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ యార్క్‌లోని క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్‌లో సామూహిక కాల్పులు చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా దాదాపు 11 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. న్యా ర్లీన్స్ మాదిరిగానే ఈ ఘటనలో కూడ ఓకారుకుసంబంధం ఉందని అధికారులు చెబుతున్నారు. న్యూజెర్సీ ప్లేట్‌లతో కూడిన బూడిద రంగు ఇన్ఫినిటీ క్యూ50 సెడాన్‌ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Also Read: Business: కొత్త ఏడాదిలో కొనుగోళ్ళు..కళకళలాడుతున్న మార్కెట్

  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment