Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

New Update
up crime

Uttar Pradesh Wife gives poisoned coffee to husband for lover

Wife Cheating: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ భార్య చేసిన అవమానకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. ఖతౌలిలోని భయాంగి గ్రామంలో పింకీ శర్మ తన ప్రేమికుడి కోసం తన భర్త అనుజ్ శర్మకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. అనుజ్ ను మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాలు ఇలా ఉన్నాయి. 

చాలాసార్లు చంపేందుకు కుట్ర.. 

ఈ మేరకు పింకీ పెళ్లైన రెండు నెలలకే తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించిందని అనుజ్ శర్మ బంధువు పూనమ్ శర్మ తెలిపారు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. దీంతో పింకీ గతంలో చాలాసార్లు అనుజ్‌ను చంపేస్తానని బెదిరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పింకీ, ఆమె ప్రియుడి మనాలి పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. పింకీ పెళ్లికి ముందే తన మేనల్లుడితో ప్రేమలో ఉందని, పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధం కొనసాగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

కాఫీలో విషం కలిపి భర్తతో తాగించి..

గొడవ జరిగిన రాత్రి పింకీ కాఫీ తయారు చేసి అనుజ్‌కి తాగడానికి ఇచ్చిందని అనుజ్ బంధువు పూనమ్ చెప్పింది. అనుజ్ తాగిన వెంటనే అతని ఆరోగ్యం క్షీణించింది. అతను వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీని తరువాత అతన్ని ఖతౌలి ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నుండి మీరట్ కు సూచించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల్లో ఉన్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంలో బాధితుడు అనుజ్ కుటుంబం పింకీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. పింకీ కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

uttarpradesh | coffee | telugu-news | today telugu news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!

ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.

New Update
Wife Set her Husband on fire in Jagtial District

Guntur Young woman attack on young man with petrol

AP Crime: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.

తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని..

అయితే మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన శ్రీలక్ష్మీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ ఘటన గురించి స్పందించిన శ్రీలక్ష్మీ.. చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. క్యారెక్టర్ గురించి నిందలు వేస్తున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి పద్ధి మార్చుకోకపోవడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించి నట్లు తెలిపింది. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27)తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలం వీరి సంసారం బాగానే ఉంది. అయితే ఇటీవల తరచూ దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మధ్యలో రాజీ చేస్తూ వస్తున్నారు. అయితే భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు. శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

 girl | boy | petrol | attack | guntur | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment