TG Crime: బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష .. జోతిష్కుడితో కలిసి  గొంతు, నాలుక కోసి!

మూఢనమ్మకాల పిచ్చితో కన్న బిడ్డనే బలిచ్చిన తల్లికి కోర్టు ఉరిశిక్ష విధించింది. సూర్యపేట మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి ఆనారోగ్యం బారిన పడింది. దీంతో 2021లో జ్యోతిష్కుడి మాటలు నమ్మి తన 7 నెలల కూతురి గొంతు, నాలుక కోసి చంపింది.

New Update
Court

Suryapet mother killing daughter case

TG Crime: మూఢనమ్మకాల పిచ్చితో  కన్న బిడ్డనే బలిచ్చిన తల్లికి కోర్టు ఉరిశిక్ష విధించింది. సూర్యపేట మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి ఆనారోగ్యం బారిన పడింది. దీంతో 2021లో జ్యోతిష్కుడి మాటలు నమ్మి తన 7 నెలల కూతురి గొంతు, నాలుక కోసి  చంపింది. అయితే ఈ కేసుపై తుది విచారణ చేపట్టిన సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డా.ఎం.శ్యాంశ్రీ ఆమెకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడిచింది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

జోతిష్కుడి మాటలు నమ్మి..

సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన బాల్యమిత్రుడు మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణను రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ముందు ఆమె ఆనారోగ్యం బారిన పడుతోంది. తల్లిదండ్రులు నాటు వైద్యులకు చూపించినా మార్పు రాలేదు. దీంతో ఓ జోతిష్కుడి మాటలు నమ్మిన భారతి రకరకాల పూజలు చేయడం మొదలుపెట్టింది. ఒక పాప పుట్టినా తన ప్రవర్తనలో మార్పురాలేదు. 


ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

ఈ క్రమంలో 2021 ఏప్రిల్‌ 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజలు చేసింది.  తన 7 నెలల బిడ్డను గొంతు, నాలుక కోసి బలిచ్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త కృష్ణ ఫిర్యాదుతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గతంలో బెయిల్‌పై విడుదలైన భారతిని గ్రామపెద్దల సూచనలతో భర్త ఇంటికి తీసుకెళ్లాడు. అయితే తనపై కేసు పెట్టాడనే కోపంతో 2023లో అతను ఇంట్లో నిద్రిస్తుండగా బలి పేరుతో తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపింది. 

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

 mother | killed | daughter | court | suryapet | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder Haryana

Rape and murder Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

5 ఏళ్ల చిన్నారిని చంపి

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

telugu-news | crime news | Minor Girl Rape | latest-telugu-news | girl raped and murdered

Advertisment
Advertisment
Advertisment