AP: తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి.. 13ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే!

తల్లి ఫోన్‌లో నీలి చిత్రాలు చూసిన 13ఏళ్ల బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏపీ ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి 5ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. నిందితుడి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు చేయించారు.

New Update
Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!

Sexually assaulted 13year old boy on 5yearold girl In AP

AP: ఏపీలో మరో దారుణం జరిగింది. మొబైల్‌లో వీడియోలు చూస్తూ ఓ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. గేమ్స్ ఆడుకుంటానంటూ తల్లి ఫోన్ తీసుకున్న 13 ఏళ్ల అబ్బాయి నెమ్మదిగా పక్కదారి పట్టాడు. ఫోన్‌లో ఆకర్షిణీయమైన అమ్మాయిల ఫొటోలు చూసి పలు లింక్ లు క్లిక్ చేశాడు. అలా ఒక్కో లింక్ ఓపెన్ చేస్తుండగా చివరికి పోర్న్ వీడియో తన కంటపడింది. అంతే ఇక అదే అదనుగా గంటల తరబడి నీలి చిత్రాలు చూడటం మొదలుపెట్టాడు. అలా రోజుల తరబడి తల్లి ఫోన్ తీసుకోవడం శృంగార చిత్రాలు చూస్తుండగా అతనికి అలా చేయాలనే కోరిక కలిగింది. దీంతో తన ఇంటి దగ్గరలోని ఓ చిన్నారిపై కన్నేశాడు. ఎవరు గమనించకముందు ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో టీడీపీ వార్డు సభ్యురాలి కొడుకు (13) స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే తల్లి మొబైల్ లో పోర్న్ చూసి 5ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లగానే రక్తస్రావం కావడంతో విషయం గమనించిన బాలిక తల్లిదండ్రుల పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని విచారిస్తున్న క్రమంలో తల్లి ఫోన్ లో నీలి చిత్రాలు చూసిన తర్వాత తనకు అలా చేయాలని కోరిక కలిగిందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలికను విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: TG: కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్న పోలీసులు.. పీడీ యాక్ట్ కేసు, రెండ్రోజుల్లో అరెస్ట్

బాలిక కుటుంబాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పరామర్శించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్న ఆయన.. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: తగ్గిపోతున్న బ్రాహ్మణుల జనాభా.. కీలక నిర్ణయం తీసుకున్న కమ్యునిటీ బోర్డు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.

New Update
Woman kills husband

భార్యల వివాహేత సంబంధాల కారణంగా బలవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరట్‌ సౌరవ్, అమిత్‌ల హత్య సంచలనంగా మరిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా మరో హత్య ఇలాగే జరిగింది. ఓ మహిళ ఛాయ్‌లో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. తర్వాత ప్రియుడితో కలిసి భర్త కేహర్ సింగ్ గొంతునొక్కి హత్య చేసింది. మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి ఉరేసుకున్నట్లు నమ్మించాలని ప్లాన్ వేసింది. కానీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం బయటపడింది. దీంతో భార్య రేఖను, ఆమె ప్రియుడు పింటూను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫతేగంజ్‌లో నివసిస్తున్న కేహర్ సింగ్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 16ఏళ్ల కింద అతనికి 25 ఏళ్ల రేఖతో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలున్నారు.

Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం

ఆత్మహత్యగా చిత్రీకరించి..

రేఖకు పింటూతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కేహర్ సింగ్‌కు ఇది తెలియడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పూర్తిగా భర్త అడ్డును తొలగించుకొని ప్రియుడితో సెట్టిల్ అవుదామని ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేసింది. ఏప్రిల్‌ 13న ఆదివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు పింటూను తన ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి గొంతు నొక్కి కేహర్‌ సింగ్‌ను హత్య చేశారు. అనంతరం భర్త మెడకు తాడు బిగించి సీలింగ్‌కు వేలాడదీశారు. ఏమి తెలియనట్లు సోమవారం తెల్లవారుజామున తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేఖ ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టింది. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

పోలీసులు అక్కడికి చేరుకొని కేహర్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గొంతు నొక్కి అతడ్ని చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో బయటపడింది. దీంతో రేఖను అదుపులోకి పోలీసులు ప్రశ్నించారు. ప్రియుడు పింటూతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నదని పోలీస్‌ ఆఫీసర్ తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. 

(Tags : Woman kills husband | Woman kills husband with boyfriend | poison | uttara-pradesh | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు