AP Crime: కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!

ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. నంద్యాల ఏనుగుమర్రి పాఠశాల సోషల్ టీచర్ బొజ్జన్న విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

New Update
Ap Crime: ఇంటర్ విద్యార్థిని పై యువకుడు అత్యాచారం!

AP Crime: ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. ఓ ఊపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు క్లాస్ రూమ్, బటయ ఖాళీ సమయాల్లో విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి, వల్గర్ గా వ్యవహరించినట్లు పలువురు బాలికలు ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి్‌ వివరాలు ఇలా ఉన్నాయి. 

సరస్వతి పూజ రోజు కూడా..

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న  బొజ్జన్న.. అదే స్కూల్ విద్యార్థినిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలొస్తున్నాయి. రెండేళ్ల నుంచి అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా విద్యార్థినీలను దూషిస్తున్నట్లు చెబుతున్నారు. సరస్వతి పూజ రోజు కూడా ఇలాగే ప్రవర్తించాడని పదవ తరగతి విద్యార్థినులంతా బోరుణ విలపిస్తూ పేరెంట్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ గోడును మహిళా టీచర్లకు వివరించగా వారంతా హెచ్ఎం వెంకటేశ్వర్లు సమాచారం అందించారు. 

Also Read: UP Crime: భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!

సెలవులపై వెళ్లిపోవాలని ఆదేశాలు..

దీంతో పిల్లలను అడిగి తెలుసుకున్న వెంకటేశ్వర్లు.. కీచక టీచర్ బొజ్జన్నను స్కూల్ కి రావద్దనీ, సెలవులపై వెళ్లిపోవాలని ఆదేశించారు.  అయితే పిల్లల తల్లిదండ్రులు బొజ్జన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇలాంటి కీచక టీచర్లు ఏ పాఠశాలలో కూడా పనిచేయడానికి వీల్లేదని వెంటనే విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Also Read: అసభ్యకర స్టెప్పులేస్తే దబిడి దిబిడే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి మహిళా కమీషన్ వార్నింగ్

(rtv telugu teacher | sexual-harassment | students | rtv telugu today telugu news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gang rape: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఊరికి వెళ్లి వస్తున్న దంపతులపై దాడి చేసి 50వేల నగదు, బంగారు నగలు దోచుకున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా పరారిలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

New Update
 Gang rape

Bihar boys gang-raped on Women

Gang rape: బీహార్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఊరికి వెళ్తున్న దంపతులను రోడ్డుపై ఆపిన దుండగులు దాడి చేసి గాయపరిచడం  కలకలం రేపింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారిలో ఉన్నారు. ఈ అవమానవీయమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..

బీహార్‌ నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన దంపతులు ఆదివారం రాత్రి తమ బంధువుల ఇంటికి వెళ్లి  బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలోనే మార్గమధ్యలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని చుట్టుముట్టారు. మొదట భర్తను కొట్టి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కొట్టారు. వారిదగ్గరున్న 50 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరకుని నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు డిఎస్పీ గోపాల్ కృష్ణ, ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ పాండే తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇక బాధిత దంపతులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి.. అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శోభా బిఘా గ్రామ నివాసి కౌశలేంద్ర కుమార్ అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న రెండవ నిందితుడికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

bihar | gangrape | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment