Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఢీ.. 15 మందికిపైగా!

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
nalgonda

nalgonda Photograph: (nalgonda)

Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చింతపల్లి బైపాస్ వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ దారుణం జరిగింది.  

పెళ్లికి వెళ్లి వస్తుండగా..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారి చింతపల్లి బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకారం నెల్లూరుకు చెందిన పలువురు హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరై ప్రైవేట్ బస్సులో నెల్లూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ట్రాక్టర్ ను బస్సు వెనక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది. ట్రాక్టర్ లో ప్రయాణం చేస్తున్న నునావత్ సునీత అక్కడికక్కడే చనిపోయింది.

ఇది కూడా చదవండి: Rape case: నలుగురు బిడ్డల తల్లిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి, గోళ్లతో రక్కి!

ట్రాక్టర్ డ్రైవర్ నునావత్ సైదాకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న రాజశేఖర్, నాగ చరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్ తోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి. డ్రైవర్ సైదాతో పాటు మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment