/rtv/media/media_files/2025/02/21/iX2EJyNivV5TGj3j8QdG.jpg)
kerala Human skull, bones found in fridge
Kerala: మీర్పేట్ ఘటన మరువకముందే మరో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. భార్యను చంపి, 2 రోజులపాటు ఉండికించి, కాల్చి ముక్కలు చేసిన గురుమూర్తి క్రూరత్వాన్ని మించిన కేసు కేరళలో ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 20 ఏళ్లపాటు ఓ ఇంటి రిఫ్రిజిరేటర్లో మానపుర్రె, ఎముకలను భద్రంగా దాచిన వార్త జనాలకు భయబ్రాంతులకు గురి చేసింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఈ ఘటన జరగగా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సంఘ వ్యతిరేక శక్తులకు నిలయం:
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చొట్టనిక్కర ప్రాంతంలోని ఒక ఇంట్లో మానవ పుర్రె, ఎముకలు లభించాయి. ఈ ఇల్లు దాదాపు 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉండగా ఇది సంఘ వ్యతిరేక శక్తులకు నిలయంగా మారింది. అయితే స్థానిక సర్పంచ్ ఇందిరా ధర్మరాజ్.. ఆ ఇంట్లో ఏదో జరుగుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఇంటిని సోదా చేయగా ఫ్రిజ్ లోపల మూడు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయబడిన మానవ పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దీంతో పాటు ఆ ఇంట్లో చాలా మానవ అవశేషాలు దొరికాయి. చాలా కాలంగా ఇక్కడ సీక్రెట్ మర్డర్స్ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంటి యజమాని చెబుతుంది నిజమేనా:
ఇందులో భాగంగానే ఇంటి యజమాని 74 ఏళ్ల డాక్టర్ ఫిలిప్ జాన్ను పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన కేరళ రాష్ట్రంలోని వైట్టిలలో నివసిస్తున్నారు. పోలీసులు సంఘటన గురించి ఆరాతీయగా తన పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారని, ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంచుతున్నట్లు జాన్ తెలిపారు. అయితే ఆ అవశేషాలు ఇంటికి ఎలా వచ్చాయి? ఇంటి యజమానికి దానితో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు సమీప నివాసితులను కూడా విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు
అవశేషాలకు ఫోరెన్సిక్ పరీక్ష:
పోలీసులు స్వాధీనం చేసుకున్న మానవ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ దర్యాప్తులో ఆ పుర్రె, ఎముకలు ఎంత పాతవో స్పష్టంగా తెలియనుంది. అయితే ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉండటం, సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని ఉపయోగించడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారిందంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే దానిని తమకు అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్పై కేసులు నమోదు!