jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త!

గుజరాత్‌లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్‌లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది.  జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.

New Update
jeera soda

Gujarat Three people died after drinking jeera soda

jeera soda: గుజరాత్‌లో దారుణం జరిగింది. ఎండలు మండిపోతుండటంతో సేద తీరేందుకు చల్లటి సోడా తాగిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) అనుమానాస్పదంగా చనిపోయారు. అయితే వీరు ముగ్గురు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించినట్లు వారి స్నేహితులు తెలిపారు. ఈ కారణంగానే ఆరోగ్య పరిస్థితి విషమించడతో స్నేహితులు నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి అడ్మిట్ అయిన కాపేపటికే చనిపోయారని పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు. 

ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్..

ఈ ఘటనపై కేసు నమోదు చేసి జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు తెలిపారు. ఆ బాటిళ్లలో ఏముందో తమకు ఖచ్చితంగా తెలియదన్నారు. విచారణలో మాత్రం మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షల్లో తేలిందన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఘటనపై మరింత స్పష్టత రానుందని చెప్పారు. 2022లో అహ్మదాబాద్, బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 42 మంది కన్నుమూశారు. 2023 డిసెంబర్ లోనూ గుజరాత్ లో ఇలాగే మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఆయుర్వేద సిరప్ తాగి 5గురు చనిపోయారు. 

ఇది కూడా చదవండి: Rangarajan: రంగరాజన్‌పై దాడిని ఖండించిన మంత్రి కొండా సురేఖ.. వారిపై ఫైర్!

న్యాయం కోసం వెళ్తే కడుపు చేసిన లాయర్..

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విడాకుల కోసం లాయర్‌(Lawyer) దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడపు చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌ కు చెందిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓవ్యక్తితో యువతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తాగి వేధింపులకు గురిచేస్తుండటంతో భర్తతో వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త నుంచి విడాకులు కోసం భధ్రాచలంకు చెందిన యువ న్యాయవాది భరణి వెంకట కార్తీక్ ను సంప్రదించింది. ఆ యువతి కేసును స్వీకరించిన వెంకటకార్తీక్‌ కొద్ధికాలం భర్తకు దూరంగా ఉండాలని యువతికి సూచించాడు.

ఇది కూడా చదవండి: B.ed: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు

లాయర్ సూచనతో తన కుమారుడితో కలిసి ఆ యువతి అద్దె ఇంట్లో ఒంటరి జీవనం సాగించింది. కేసు విషయమై మరోసారి లాయర్‌ కార్తీక్‌ను సంప్రదించింది. డైవర్స్ విషయం తాను చూసుకుంటానని తన కామవాంఛ తీర్చాలంటూ కార్తీక్‌ ఆ యువతిని కోరాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లికూడా చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు. యువతి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాయర్‌ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చగా న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment