Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

New Update
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?

Rave Party

ఏపీలోని  బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీతూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది.లో రేవ్ పార్టీని కొందరు నిర్వహించారు. సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలోని యువతులు గుంటూరు, యువకులు, రెసిడెన్సీ ఓనర్ రాజమండ్రికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. యువతీ, యువకులతో పాటు రెసిడెన్సీ ఓనర్‌ కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

రేవ్ పార్టీ అంటే?

హ‌ద్దుల్లేని శృంగారం.. ఎక్కువగా మద్యం సేవించడం.. మైకంలోకి వెళ్లడం..ఎంజాయ్ చేయడం.. ఇదే రేవ్ పార్టీ. ఈ మధ్య కాలంలో ఈ రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రేవ్‌ పార్టీలు నిర్వహించేది చాలా పెద్ద తలకాయలే అని చెప్పడానికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే సినీలోకం ఈ రేవ్‌ పార్టీలకు ఎందుకు దాసోహం అవుతుందన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది.

ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

తమ కెరీర్‌ను, ఆరోగ్యాన్ని రిస్క్‌ చేసి మరీ సినీనటులు ఎందుకీ పార్టీలకు వెళ్తుంటారు. ఈ పార్టీల్లో ఎక్కువగా డ్రగ్స్ వాడుతారనే అభియోగాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి వల్ల చాలా మంది ఈ డ్రగ్స్ తీసుకుంటారు. గతంలో కేవలం సినిమా వాళ్లు మాత్రమే ఎక్కువగా రేవ్ పార్టీలకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం అందరూ కూడా ఈ రేవ్ పార్టీలకు వెళ్తున్నారు. ఈ రేవ్ పార్టీలో కేవలం డ్రగ్స్ అనే కాకుండా మితిమీరిన శృంగారం కూడా ఉంటుంది. ఎక్కువగా వ్యాపారవేత్తలు, ధనవంతులు ఈ రేవ్ పార్టీలకు వెళ్తుంటారని అభియోగాలు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ఇది కూడా చూడండి: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

East Godavari : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు!

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

New Update
Muthoot Finance

Muthoot Finance

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న  ఓ వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు.  పందిరి వెంకటనారాయణ 57 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటనారాయణ దగ్గర నుంచి రూ.50 లక్షల విలువైన  630 గ్రాముల బంగారం, 3.64 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణ దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  నిందితుడుపై  పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.  

Also Read : కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment