Acid attack: చిత్తూరు యాసిడ్ దాడి ఘటన..15 నిమిషాల్లోనే నిందితుడు అరెస్ట్!

ఏపీ అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమపేరుతో పార్వంపల్లి గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడి పారిపోయిన గణేష్ ను 15 నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరాతీశారు. 

New Update
acid case

Chittoor acid attack case Police arrest suspect in 15 minutes

AP News: ఏపీ అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమ పేరుతో మదనపల్లె అమ్మచెరువు మిట్ట గణేష్.. పార్వంపల్లి గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడి పారిపోగా 15 నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరాతీశారు. 

ప్రపోజ్ చేయడానికి ఇంటికెళ్లి..

ఈ మేరకు గుర్రంకొండ ప్యారంపల్లి గ్రామానికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23)ని కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందని గణేష్ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రేమికుల రోజు సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఇంటికెళ్లాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితుడిని 15 నిమిషాల్లో అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడికి గురైన మహిళను, తల్లిదండ్రులను మదనపల్లి ఆసుపత్రిలో మంత్రి మండిపల్లి పరామర్శించారు. మంత్రి నారా లోకేష్‌ సైతం ఫోన్ లో బాధితురాలు గౌతమితో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడు గణేష్ ను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ!

యాసిడ్ దాడులను సహించేది లేదు.. 

ఇక యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని కేవలం 15 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపిచినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలు ముందస్తు జాగ్రత్తగా పోలీసులను ఆశ్రయించాలన్నారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించినట్లు చెప్పారు. ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని లోకేష్‌ తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోరుకునేంతవరకు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. యాసిడ్ దాడికి గురైన మహిళకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తాం. యాసిడ్ దాడులను సహించేది లేదని హెచ్చరించారు లోకేష్. 

ఇది కూడా చదవండి: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment