USA Road Accident: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి

దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

New Update
bolivia

bolivia Photograph: (bolivia )

USA Road Accident: పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దక్షిణ అమెరికా బొలీవియా(South America Bolivia) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. యోకల్లా నైరుతి జిల్లాలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 800 మీటర్ల లోయలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. డ్రైవర్ బస్సు నియంత్రణ కోల్పోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది.

Also Read:  సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

Also Read:  మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో

అత్యంత తీవ్రమైన రోడ్డు ప్రమాదం..

పోటోసి, ఒరురో నగరాల మధ్య ప్రయాణిస్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు. బొలీవియాలో ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ఎందుకంటే ఇక్కడ అన్నీ కొండలు, లోయలతో కూడుకున్న రోడ్లు ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు దక్షిణ అమెరికా దేశంలో జరిగిన అత్యంత తీవ్రమైన రోడ్డు ప్రమాదం ఇదే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దాదాపు 12 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి సంవత్సరం సగటున 1,400 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు.

Also Read:  విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..

Also Read:  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment