Crime: వదినపై కన్నేసి.. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి ఎంత కృరంగా చంపాడంటే!?

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న గోపాల్ అనే వ్యక్తి.. అడ్డుగా ఉన్నాడని అన్ననే చంపేశాడు. మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి అతి కృరంగా కడతేర్చాడు.

New Update
medak

medak

Medak: వదినతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని అన్ననే మట్టుపెట్టాడో కసాయి తమ్ముడు.. అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి విద్యుత్‌ వైర్లు చుట్టి.. కరెంట్‌ షాక్‌ పెట్టి ప్రాణం తీశాడు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో జరిగిన ఈ ఘటనలో తేజావత్‌ శంకర్‌(28) తన తమ్ముడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు. నాను తండాకు చెందిన శంకర్‌ (28), గోపాల్‌ (20) అన్నదమ్ములు. శంకర్‌ గతంలో రెండు వివాహాలు చేసుకుని విడాకులు తీసుకున్నాడు. 

Also Read: Khammam: తల్లీ చెల్లి వీడియోలతో..లోన్ యాప్ అరాచకాలు.. మరో ప్రాణం బలి! మీరూ ఈ తప్పు చేయకండి

ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏడాది క్రితం తల్లిదండ్రులు లేని మరో యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుని తండాకు తీసుకొచ్చాడు. అయితే, శంకర్‌ భార్యతో గోపాల్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.తన భార్యతో గోపాల్‌ సన్నిహితంగా ఉండడాన్ని చూసిన శంకర్‌ తన భార్య జోలికి రావొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అయినా, గోపాల్‌ మారకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించాడు. 

Also Read: Nigeria: నైజీరియాలో పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 70 మంది మృతి!

కాలికి, చేతికి కరెంట్ వైర్లు చుట్టి..

దీంతో శంకర్‌ భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శంకర్‌పై గోపాల్‌ కక్ష పెంచుకున్నాడు. అయితే ఓ చోరీ కేసులో ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన గోపాల్‌ అవకాశం కోసం చూస్తున్నాడు.  ఈ క్రమంలో శంకర్‌ మద్యం తాగి రాత్రి నిద్రపోయాడు. అతని వద్దే పడుకున్న గోపాల్‌ అర్ధరాత్రి తర్వాత .. శంకర్‌ కాలికి, చేతికి విద్యుత్‌ వైర్లు చుట్టి ప్లగ్‌ బోర్డులో స్విచ్‌ ఆన్‌ చేశాడు. 

దీంతో శంకర్‌ విద్యుదాఘాతానికి గురై కేకలు వేశాడు. ఆ అలికిడికి నిద్ర లేచిన వారి తండ్రి చందర్‌.. తలుపులు తీయమని అరిచాడు. తలుపు తీసిన గోపాల్‌ తండ్రి చందర్‌ను నెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గోపాల్‌ను అదుపులోకి తీసుకునిఅరెస్ట్‌ చేశారు.

Also Read: Mahakumbh 2025: ప్రతి అఖాడాకు ప్రత్యేక చట్టాలు.. సాధువులు తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి?

Also Read: Barack Obama Birthday: హ్యాపీ బర్త్ డే మై లవ్.. భార్యకు ఒబామా పుట్టిన రోజు విషెస్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment