AP Crime: తలదూర్చిందని తల నరికేశాడు.. ఏపీలో ఉమెన్స్ డే రోజు దారుణం!

ఉమెన్స్ డే రోజే ఏపీలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పిల్లల గొడవలే ఇందుకు కారణం కాగా మాలతి తల లోతుగా తెగింది. ఆమెను అస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
murder ap

murder ap Photograph: (murder ap)

AP Crime: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఘోరం జరిగింది. పట్టపగలే ఓ వివాహితపై దాడి జరిగింది. eజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పిల్లలు అల్లరి చేస్తున్నారని..

ఈ మేరకు అనాతవరంలో తన ఇంటి నుంచి మాలతి బయటకు వెళ్తోంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుండగా చిన్నగా మందలించింది. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న జయ రామకృష్ణ పిల్లలను ఎందుకు మందలిస్తున్నావంటూ మాలతితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగటంతో గొడవ పెద్దదైంది. క్షిణికావేశానికి లోనైన రామకృష్ణ కోపంలో కత్తితో మాలతి‌ మెడపై దాడి చేశాడు. ఆ కత్తి దాడికి మాతలి ఎడమవైపు తల లోతుగా తెగింది. 

Also read :  షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే గొంతు కోశాడు!

దీంతో మాలతి అపస్మారక స్థితికి చేరడంతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మాలతికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. నిందితుడు జయ రామకృష్ణ భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉండగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment