Movies:గేమ్‌ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో సినిమా విడుదల రోజు ఉదయం 4 గంటలు, 6 గంటల షోలకు కూడా అనుమతినిచ్చింది.  అర్ధరాత్రి ఒంటిగంట బెనిఫిట్ షోకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

author-image
By Manogna alamuru
New Update
 game changer advance bookings

ram charan game changer

శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ వచ్చే శుక్రవారం విడుదల అవనుంది. డాకూ మహారాజ, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్‌తో పాటూ గేమ్ ఛస్త్రంజర్‌‌ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. దీని టికెట్ల పెంఉ విషయంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలీజ్‌ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు, జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ఉదయం 4, 6 గంటల షలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే అర్ధరాత్రి ఒంటిగంటకు వేసే బెనిఫిట్ షోకు మాత్ర అనుమతి ఇవ్వలేదు. దాని కోసం చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. 

ఆంధ్రాలో కూడా అనుమతి..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చేసింది. అక్కడ గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ రెండు సినిమాలకూ టికెట్ రేట్లను పెంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఏపీలో అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షో కూడా వేయనున్నారు. దీని టికెట్ ధర  రూ.600గా నిర్ణయించారు. అలాగే జనవరి 10న ఆరు షోలకు కడా అనుమతినిచ్చింది ఏపీ గవర్నమెంట్. ఇక టికెల రేట్ల విషయానికి వస్తే..మల్టీ ప్లెక్స్‌లో అదనంగా జీఎస్టీతో కలిపి రూ..175, సింగిల్ థియేటర్లలో రూ.135  వరకూ టికెట్ ధర పెంచేందుకు అనుమతి లభించింది.  జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.

Also Read: AP: రేపు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Srinidhi Shetty లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

నటి శ్రీనిధి శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అయితే నితీష్ తివారీ 'రామాయణం' లో సీత పాత్రలో నటించమని ముందుగా తనకు ఆఫర్ వచ్చిందట. కానీ అందులో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారని తెలిసి.. ఆ పాత్రను వద్దనుకున్నట్లు తెలిపింది.

author-image
By Archana
New Update
Srinidhi Shetty approached for bollywood Ramayana

Srinidhi Shetty approached for bollywood Ramayana

Srinidhi Shetty కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం నాని హిట్ 3 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి నితీష్ తివారీ బాలీవుడ్ 'రామాయణం' గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ముందుగా తనకు ఆఫర్ వచ్చినట్లు తెలిపారు.  అయితే ఇందులో హీరో యష్ రావణాసురిడి పాత్రలో నటిస్తున్నారని తెలిసి.. చేయనని చెప్పినట్లు చెప్పింది. యష్- శ్రీనిధి 'కేజీఎఫ్' సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం 'రామాయణం' లో  రాముడి పాత్రలో రన్బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అన్నీ కుదిరితే శ్రీనిధి సీతగా కనిపించెదనమాట. 

నాని జోడీగా

ఇదిలా ఉంటే 'హిట్ 3' లో శ్రీనిధి నాని జోడీగా కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, మూవీ సాంగ్స్ లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధికి 'హిట్ 3' మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని అనుకుంటున్నారు. 'హిట్ 3' మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని సొంత ప్రొడక్షన్ వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 

హిట్ 2, హిట్ 2 సూపర్ సక్సెస్ కావడంతో హిట్ 3 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా ఉండబోతుందని పలు ఇంటర్వ్యూస్ లో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు నాని. అంతేకాదు ఈ సినిమా బాగోకపోతే తన నెక్స్ట్ మూవీ  'ప్యారడైస్' చూడొద్దు అని కూడా చెప్పారట. దీంతో సినిమా ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. దసరా,హయ్ నాన్న, కోర్టు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నాని.. ఈ సినిమాతో కూడా  సక్సెస్ వస్తుందని భావిస్తున్నారు. మరి సినిమా అనుకున్నట్లుగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.  

latest-news | cinema-news | Srinidhi Shetty HIT- 3 | ramayanam-movie | kgf-hero-yash

Advertisment
Advertisment
Advertisment