Tollywood Divorce: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

నటి కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడంతో పుకార్లకు తెరలేపింది. దీంతో స్వాతి ఇండైరెక్ట్ గా విడాకులు కన్ఫార్మ్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.

New Update
colors swathi divorce

colors swathi divorce

Tollywood Divorce:  ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే సెలెబ్రెటీల సంఖ్య ఎక్కువైంది. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక భేదాభిప్రాయాలతో విడాకుల బాట పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సెలెబ్రెటీ చేరబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్

స్వాతి విడాకులు (Colors Swathi On Divorce)

టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. స్వాతి 2018లో వికాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత  అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తూ..  తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ పై కేటాయించారు. అయితే తాజాగా స్వాతి తన సోషల్ అకౌంట్ లో భర్తకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్వాతి ఇండైరెక్ట్ గా విడాకులు కన్ఫార్మ్ చేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే గతంలో కూడా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు రాగా.. పలు ఇంటర్వ్యూలో దీని గురించి స్వాతిని ప్రశ్నించారు.  దీంతో ఆమె ఫోటోలు డిలేట్ చేసినంత మాత్రాన విడిపోతున్నట్లు ఎలా అనుకుంటారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా కలర్స్ స్వాతిగా మారింది స్వాతిరెడ్డి. స్వాతికి తెలుగులో అష్టా చమ్మా సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కార్తికేయ సినిమా ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. స్వాతి తెలుగులో జిలాని,బ్రేకప్,లేడీస్ అండ్ జెంటిల్మెన్,చిత్రాంగద, సింబా మొదలైన సినిమాలు చేసింది.   చివరిగా 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

Also Read :  భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment